దివ్యాంగుల పింఛను పెంపు
దివ్యాంగుల పింఛన్ను రూ.1,500లకు పెంచుతున్నట్లు, జనవరి నుంచి ఈ మేరకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి ప్రకటన
పురస్కారం అందజేస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: దివ్యాంగుల పింఛన్ను రూ.1,500లకు పెంచుతున్నట్లు, జనవరి నుంచి ఈ మేరకు అందించనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. కలైవాణర్ అరంగంలో శనివారం జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. వారికి పలు సంక్షేమ పథకాల కింద సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పుట్టుకతో లోపం ఉన్నా, తర్వాత ఏర్పడినా బాధితులపై ప్రత్యేక దృష్టి అవసరమని తెలిపారు. అవయవాలలోనే లోపమని.. వారి తెలివి, సామర్థ్యంలో కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఆ మేరకు దివ్యాంగులను గౌరవించాలని పేర్కొన్నారు. అందరిలా అన్ని వసతులు, అవకాశాలను దివ్యాంగులు కూడా పొందాలని తెలిపారు. సముద్ర జలాల్లో దివ్యాంగులు కూడా కాళ్లు తడపాలనే ఉద్దేశంతో మెరినా తీరంలో మార్గం ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రానికి చెందిన మారియప్పన్ తన అవయవలోపాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొని నేడు దేశానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. మదురైకు చెందిన బాడ్మింటన్ క్రీడాకారిణి జెర్లిన్ అనికా తన అత్యుత్తమ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. శారీరక వైకల్యం ఏర్పడినా కుంగిపోకుండా అమర్సేవా సంఘం వ్యవస్థాపకుడు రామకృష్ణన్, శంకరరామన్ వంటివారు తమను సంరక్షించుకుంటేనే పలువురికి సేవలు అందించి జాతీయ పురస్కారాలు పొందారని పేర్కొన్నారు. దివ్యాంగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిపుణులు, ఉన్నతస్థాయి కమిటీలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంట్లో నుంచే వారు ఉద్యోగం చేసుకునే పరిస్థితిని కల్పించనున్నామని పేర్కొన్నారు. రెవెన్యూశాఖ తరఫున కంటిచూపులేని దివ్యాంగులు తదితర 4,39,315 మంది ప్రస్తుతం పొందుతున్న రూ.వెయ్యి పింఛన్ను రూ.1,500లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి నుంచి ఇది అమలు చేస్తామన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.263.58 కోట్లు అదనంగా ఖర్చు కానుందని తెలిపారు.
సామాజిక కార్యకర్తలకు పురస్కారాలు
దివ్యాంగులకు ఉత్తమ సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి పురస్కారాలు అందించారు. ఆ మేరకు ఉత్తమ సామాజిక కార్యకర్తగా మయిలాడుతురై జిల్లాకు చెందిన జయంతి ఉదయకుమార్, ఉత్తమ సంస్థగా తిరుచ్చి జిల్లాకు చెందిన ఇన్టాక్ట్ ప్రత్యేక పాఠశాల ట్రస్టు, బుద్దిమాంధ్యులకు బోధించినందుకుగాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా తేని జిల్లాలోని లూసిక్రాసన్సియా ప్రత్యేక పాఠశాల, వృత్తిశిక్షణ కేంద్రానికి చెందిన కవిత, వినికిడిలోపం, దృష్టిలోపం ఉన్నవారికి బోధించినందుకు చెన్నైకు చెందిన ఉపాధ్యాయులు జేమ్స్ మార్గరెట్, ఉత్తమ సిబ్బందిగా సరస్వతి, అరివళగన్, బాలాజీ, సుందరం, నివేద, కలైవాణి, అన్నమేరి, బొమ్మనన్ తదితరులకు పురస్కారాలు అందించారు. వారికి 10 గ్రాముల బంగారం, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోని విజేతలకు బహుమతులు అందించారు. ‘నాన్ ముదల్వన్’ పథకం కింద వంద మందికి ల్యాప్టాప్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఐదుగురికి వాటిని అందించారు. ముందుగా కాంచీపురం, రాణిపేట, తిరుపత్తూరు, మయిలాడుతురై, తెన్కాశి, కళ్లకురిచ్చి తదితర ఆరు కొత్త జిల్లాలకు దివ్యాంగుల కోసం సంచార చికిత్సా వాహనాలను ప్రారంభించారు. ఊదా స్టాల్, ఆధునిక ఉపకరణాల ప్రదర్శనను కూడా ఆరంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, గీతాజీవన్, సుబ్రమణియన్, శేఖర్బాబు, గణేశన్, ఎమ్మెల్యే ఎళిలన్, దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యదర్శి ఆనందకుమార్, కమిషనరు జెసిందా లారెన్స్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు