‘ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం వీరమణి’
ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం ద్రావిడర్ కళం అధ్యక్షుడు వీరమణి అని ముఖ్యమంత్రి స్టాలిన్ అభివర్ణించారు.
స్టాలిన్తో అన్బళగన్ కుటుంబసభ్యులు
చెన్నై, న్యూస్టుడే: ద్రావిడ సిద్ధాంతాలకు నిలువెత్తు రూపం ద్రావిడర్ కళం అధ్యక్షుడు వీరమణి అని ముఖ్యమంత్రి స్టాలిన్ అభివర్ణించారు. కలైవాణర్ అరంగంలో జరిగిన వీరమణి 90వ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... సామాజిక న్యాయం కోసం పెరియార్ అంతర్జాతీయ అమెరికా సంస్థ తరఫున ఈ ఏడాది వీరమణి పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీరమణికి శతజన్మదిన వేడుకలూ నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శియైన ఎంపీ వైగో, ఐయూఎంఎల్ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, ద్రావిడర్ కళగం ఉపాధ్యక్షుడు కలి పూంకుండ్రన్, కోశాధికారి కుమరేశన్, ప్రధాన కార్యదర్శి అన్బురాజ్, ఉప ప్రధానకార్యదర్శి ఇన్బకని, ద్రావిడ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రిన్స్ ఎన్నారెసు పెరియార్ తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకకు హాజరు
చెన్నై, న్యూస్టుడే: టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు కృష్ణస్వామి మనవరాలు, ఎంపీ విష్ణుప్రసాద్ కుమార్తె ప్రతిక్ష-నవమణి రాజేంద్రన్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం నగరంలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. వెంట మంత్రులు పొన్ముడి, శేఖర్బాబు, మస్తాన్, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు, ఎంపీ అన్బుమణి ఉన్నారు.
ఫొటో జర్నలిస్ట్ మృతికి సంతాపం
చెన్నై: డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ సీనియర్ ఫొటో జర్నలిస్ట్ రాజేశ్ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్, సమాచారశాఖ మంత్రి స్వామినాథన్ సంతాపం ప్రకటించారు. మురసొలి దినపత్రికలో 28 ఏళ్లకుపైగా పనిచేసిన ఆయన అంకితభావం, నిరంతరశ్రమ కీర్తించదగిందని ముఖ్యమంత్రి తెలిపారు.
అన్బళగన్ కుటుంబసభ్యుల భేటీ
చెన్నై, న్యూస్టుడే: డీఎంకే దివంగత ప్రధానకార్యదర్శి అన్బళగన్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అన్బళగన్ శతజయంతి స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ కొనసాగుతున్న డీపీఐ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రాంగణాన్ని ‘పేరాసిరియర్ అన్బళగన్ కల్వి వళాగం’గా పిలవనున్నట్టు, ఉత్తమ పాఠశాలలకు ఆయన పేరిట పురస్కారాలు అందించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్బళగన్ కుమారుడు అన్బుసెల్వన్, మనవడు ఎంపీ వెట్రియళగన్ శనివారం క్యాంపుకార్యాలయంలో స్టాలిన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.