వరద కష్టాల నుంచి ఊరటే లక్ష్యం
మండౌస్ తుపాను ప్రభావం చెన్నైపైనా ఉండొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. దీనికి తగ్గట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది.
ఐఏఎస్ల బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఇటీవల వర్షాల సమయంలో సత్ఫలితాలు
అధికారుల బృందంతో మాట్లాడుతున్న సీఎస్ ఇరైయన్బు
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ను వరద ముప్పు నుంచి తప్పించడంలో చాలావరకు ప్రభుత్వం విజయవంతమైంది. తొలి విడతలో భాగంగా చాలాచోట్ల వరదకాలువల నిర్మాణాల్ని చేపట్టారు. ఇటీవల వర్షాలకు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఈ కాలువల కారణంగా ఊరట చెందారనే చెప్పాలి. ఇలా పనులు మరిన్ని ప్రాంతాలలో చేపట్టేందుకు కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. వరద కాలువల్ని ప్రణాళిక ప్రకారం నిర్మించడం, జోన్లలోని లోతట్టు ప్రాంతాలకు ముప్పును తప్పించడమే లక్ష్యంగా ఓ ప్రత్యేక ఐఏఎస్ల బృందం పనిచేస్తోంది. ఫలితాలు కూడా చక్కగా వస్తున్నాయి.
- ఈనాడు, చెన్నై
తుపాను హెచ్చరికల నేపథ్యంలో సహాయ చర్యల కోసం రిప్పన్ భవనంలో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 1913
నెంబరులో సంప్రదించి సేవలు పొందొచ్చని ప్రకటించారు.
మండౌస్ తుపాను ప్రభావం చెన్నైపైనా ఉండొచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. దీనికి తగ్గట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) ఏర్పాట్లు చేస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక సహాయక బృందాల్ని పంపుతోంది. గాలుల ప్రభావానికి అవకాశముందని చెప్పడంతో.. ఎక్కడైనా చెట్లు లాంటివి పడిపోయినా వెంటనే తొలగించేందుకు ప్రత్యేక పరికరాలను సమకూర్చుకుంటున్నారు. గతంలో వర్షాల్లాగే ఈసారి తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా చెన్నైని వరద భయం వేధిస్తోంది. 2015, 2021 వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. నీటివనరుల దగ్గరే నిర్మాణాలు పెరగడం, కాలువలున్నా డిజైన్లు సక్రమంగా లేకపోవడం, తీవ్రమైన లీకేజీలు, మురుగునీటి పారుదల వ్యవస్థలో లోపాలు, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాలుగా ఉన్నాయి. లోపాల్ని విశ్లేషించి పరిష్కారాల్ని చూపించేందుకు జీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలువల నిర్మాణంలో సాంకేతికత అవసరం, పైగా ఇంజినీర్లే వాటికి సరైన రీతిలో పరిష్కారం చూపే అవకాశముంది. దీంతో ఇంజినీరింగ్ నేపథ్యమున్న ఐఏఎస్లనే ఓ బృందంగా నియమించారు. వీరిని నగరంలో రీజినల్ డిప్యూటీ కమిషనర్లుగా నియమించారు. ఎం.శివగురు ప్రభాకరన్, షేక్ అబ్దుల్ రహమాన్, ఎం.పి.అమిత్ ఈ బృందంలో ఉన్నారు. వీరు జీసీసీ కమిషనర్ గగన్దీప్సింగ్ బేడీ ఆధ్వర్యంలో పనిచేశారు.
లోతైన అధ్యయనం తర్వాత...
నగరంలో వరద కాలువల నిర్మాణాలకు ముందు ఈ ముగ్గురు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించారు. జీసీసీ దగ్గర అందుబాటులో ఉన్న డాటా, తాము క్షేత్రస్థాయిలో తెలుసుకున్న విషయాల ఆధారంగా లోపాల్ని తెలుసుకున్నారు. తగిన రీతిలో కాలువలు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. రాబోయే 30 ఏళ్లు వర్షాలకు తట్టుకునే సామర్థ్యమున్న కాలువల్ని డిజైన్ చేశారు. ఆ తర్వాతే నిర్మాణాల్ని చేపట్టినట్లు అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు రోజులతరబడి నీరు నిలుస్తోంది. అక్కడ మోటార్లతోనే నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది. దీనికోసం ఎక్కువ సామర్థ్యంతో కూడిన నాణ్యమైన విద్యుత్తు మోటార్లను వినియోగించారు. సజావుగా పనిచేశాయని, చాలావరకు ఇబ్బందుల్ని సకాలంలో దూరం చేశామని అధికారులు తెలిపారు. వీధులు, అంతర్గత రోడ్లు, జాతీయ రహదారుల్లో ఎక్కడా నీరు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రైవేటు ప్రాంతాల యజమానులను అప్రమత్తం చేసి వారే స్వయంగా నీటిని తోడించేందుకు ఏర్పాట్లు చేసుకునేలా చూస్తున్నారు.
కాశిమేడు హార్బరులో గురువారం సాయంత్రం అలల ఉద్ధృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు