logo

వైభవంగా గిరిప్రదక్షిణ

అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా ఉన్నాములై సమేత స్వామివారు ప్రత్యేక అలంకరణలో గురువారం ఉదయం గిరి ప్రదక్షిణ చేశారు.

Published : 09 Dec 2022 00:58 IST

గిరి ప్రదక్షిణ చేస్తున్న ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే:  అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా ఉన్నాములై సమేత స్వామివారు ప్రత్యేక అలంకరణలో గురువారం ఉదయం గిరి ప్రదక్షిణ చేశారు. ముందుగా ఆలయంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొండపై మహాదీపం వెలిగించడంతో ఉత్సవాలు ముగిశాయి. బుధవారం రాత్రి నుంచి 3 రోజుల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అయ్యన్‌గుంటలో ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని