అన్ని విధాలా సిద్ధంగా ఉండండి
తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు.
తుపాను నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు
సమీక్ష నిర్వహిస్తున్న ఇరైయన్బు
చెన్నై, న్యూస్టుడే: తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 11వ తేదీ వరకు భారీ, అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీర ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు తుపాను హెచ్చరికలు జారీ చేయాలన్నారు. కామన్ అలర్ట్ ప్రొటోకాల్, టీఎన్స్మార్ట్ యాప్, సామాజిక మాధ్యమాల ద్వారా తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే అవసరమైన బోట్లు, ఉపకరణాలను ఉంచాలని పేర్కొన్నారు. జాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, బలమైన గాలులతో కూలే వృక్షాలను వెనువెంటనే తొలగించాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల నిల్వ ఉంచాలని, దెబ్బతినే కనెక్షన్ల పునరుద్ధరణకు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక బస్తాలు, అవసరమైన మందులను నిల్వ ఉంచాలని సూచించారు. ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, రక్షిత నీరు, మందులు తదితర వసతులు కల్పించాలని తెలిపారు. జలాశయాల పరిస్థితిపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు జలాల విడుదలప్పుడు ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సేవలు అందించడానికి రహదారులు, జలవనరులు, విద్యున్మండలి, అగ్నిమాపక తదితర శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు