అన్ని విధాలా సిద్ధంగా ఉండండి
తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు.
తుపాను నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు
సమీక్ష నిర్వహిస్తున్న ఇరైయన్బు
చెన్నై, న్యూస్టుడే: తుపాను, భారీవర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఆదేశాలిచ్చారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 11వ తేదీ వరకు భారీ, అతిభారీ వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సముద్రతీర ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు తుపాను హెచ్చరికలు జారీ చేయాలన్నారు. కామన్ అలర్ట్ ప్రొటోకాల్, టీఎన్స్మార్ట్ యాప్, సామాజిక మాధ్యమాల ద్వారా తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుగానే అవసరమైన బోట్లు, ఉపకరణాలను ఉంచాలని పేర్కొన్నారు. జాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, బలమైన గాలులతో కూలే వృక్షాలను వెనువెంటనే తొలగించాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల నిల్వ ఉంచాలని, దెబ్బతినే కనెక్షన్ల పునరుద్ధరణకు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక బస్తాలు, అవసరమైన మందులను నిల్వ ఉంచాలని సూచించారు. ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని పేర్కొన్నారు. అవసరమైన ఆహారం, రక్షిత నీరు, మందులు తదితర వసతులు కల్పించాలని తెలిపారు. జలాశయాల పరిస్థితిపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు జలాల విడుదలప్పుడు ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సేవలు అందించడానికి రహదారులు, జలవనరులు, విద్యున్మండలి, అగ్నిమాపక తదితర శాఖలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్