అన్నా గ్రంథాలయంలో సాహితీ వేడుకలకు ఏర్పాట్లు
కొట్టూరుపురంలోని ‘అన్నా లైబ్రరీ’ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారనుంది. జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం ‘చెన్నై లిటరరీ ఫెస్టివల్’ను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది.
గ్రంథాలయం లోపలిభాగం
వడపళని, ప్యారీస్, న్యూస్టుడే: కొట్టూరుపురంలోని ‘అన్నా లైబ్రరీ’ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారనుంది. జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వం ‘చెన్నై లిటరరీ ఫెస్టివల్’ను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ వేడుకలకు వంద మంది రచయితలు, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. పుస్తకాలపై సమీక్ష, చిన్నారుల సాహిత్యం, కథలు చెప్పడంపై చర్చలు జరుగుతాయని పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ కె.ఇలంబవహత్ పేర్కొన్నారు. చెన్నై పుస్తక ప్రదర్శనలో ఫొటోగ్రఫీ, చిత్రలేఖనంపై ప్రదర్శనతో పాటు కొత్త పుస్తకాలను ఆవిష్కరిస్తారు. సాహిత్యంపై అభిరుచి ఉన్న కళాశాల విద్యార్థులను కూడా వేడుకలకు ఆహ్వానించేందుకు ఆలోచిస్తున్నామని ఇలంబవహత్ అన్నారు. ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాలు, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి హాలు మరమ్మతులు పూర్తి చేశాక మొదటిసారి జరుగుతున్న పెద్ద కార్యక్రమమని ఆయన చెప్పారు. రూ.38 కోట్లతో నూతన మరుగుదొడ్లు, నేల మరమ్మతులు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఆడియో విధానం, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి తగిన విధంగా హాలు నిర్మాణాలు జరిగాయి. కార్యక్రమాలు నిర్వహించేందుకు రాయితీతో కూడిన అద్దె వసూలు చేస్తారు. ‘టీఎన్ టాక్’ అనే అంశంపై 13వ తేదీ సీనియర్ పాత్రికేయుడు పి.సాయినాథ్ ప్రసంగిస్తారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా జురాసిక్ పార్కు, నయాగరా జలపాతం వంటివి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 1400 మంది కూర్చునే వీలు, 417 కార్లు, 1026 ద్విచక్ర వాహనాలు పార్కు చేసుకునే వసతి వంటివి ఉన్నాయి. గ్రౌండు ఫ్లోరులో బ్రెయిలీ లిపి సెక్షను, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు చదువుకునేందుకు, మొదటి అంతస్తులో వార, పక్ష, మాస పత్రికలు, చిన్నారుల సెక్షను, రెండో అంతస్తులో తమిళ పుస్తకాలు, పుస్తకావిష్కరణకు హాలు, మూడో అంతస్తులో కంప్యూటర్ సైన్సు, సోషల్ సైన్సుకు సంబంధించిన పుస్తకాలు, నాలుగో అంతస్తులో ఇంగ్లిషు, ఎకనమిక్స్, లా (న్యాయశాస్త్రం) పుస్తకాలు, అయిదో అంతస్తులో సైన్సు, వైద్య శాస్త్రానికి సంబంధించినవి, ఆరో అంతస్తులో ఇంజినీరింగు, ఫైనార్ట్స్, ఏడో అంతస్తులో ప్రభుత్వానికి చెందిన ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్, చరిత్ర, భౌగోళం, ఇ-లైబ్రరీ, ఎనిమిదో అంతస్తులో పరిపాలన కార్యాలయం, కల్వి టీవీ స్టూడియోలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!