Panneerselvam: మళ్లీ రేసులోకి ఓపీఎస్.. అన్నాడీఎంకేలో అదే గందరగోళం
అన్నాడీఎంకే ఏక నాయకత్వ సమస్య మొదలైనప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్, అతని మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించారు.
భాజపాపై ఎడప్పాడి ఒత్తిడి?
జేపీ నడ్డాతో ముచ్చటిస్తున్న పన్నీర్సెల్వం
సైదాపేట, న్యూస్టుడే: అన్నాడీఎంకే ఏక నాయకత్వ సమస్య మొదలైనప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్, అతని మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించారు. అదేవిధంగా ఎడప్పాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అయితే అప్పటి నుంచీ పార్టీలో ఇప్పటికీ తానే సమన్వయకర్తనని చెబుతూ వస్తున్నారు పన్నీర్. ఇదిలా ఉండగా సర్వసభ్య సమావేశం కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కోర్టు తీర్పు సంగతి ఎలా ఉన్నా భాజపా పెద్దల మద్దతు కూడగట్టేందుకు ఓపీఎస్, ఈపీఎస్లు పోటాపోటీగా యత్నిస్తున్నారు. అయితే భాజపా పెద్దల మద్దతు పన్నీర్కే అన్న అభిప్రాయం రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచే ఉంది. అయితే నిజానికి అన్నాడీఎంకేలో ఓపీఎస్, ఈపీఎస్లు వర్గాలుగా విడిపోయిన తర్వాత ఇద్దరిని సమానంగానే భాజపా చూస్తూ వస్తోంది. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు, నిర్వాహకులు ఎక్కువ శాతం మంది తనవైపే ఉన్నారని, ఆ ప్రకారమే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తనను ఎంచుకున్నారని పళనిస్వామి చెబుతున్నారు. దీంతో తనకు సరిసమానంగా ఓపీఎస్కు భాజపా ప్రాముఖ్యత ఇవ్వటం ఎడప్పాడికి రుచించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సు సంప్రదింపుల సమావేశానికి ప్రధాన కార్యదర్శి అని పేర్కొంటూ పళనిస్వామికి ఆహ్వానం అందడంతో భాజపా అధిష్ఠానం ఈపీఎస్ వైపు మొగ్గు చూపుతోందని వార్తలు వచ్చాయి. ఈ ఆహ్వానంతో ఎడప్పాడి వర్గంలో ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో ఆ కార్యక్రమానికి ఓపీఎస్ను ఆహ్వానించకపోవడంతో ఆయన వర్గం నీరసించింది. దీని గురించి కేంద్రానికి పన్నీర్ లేఖ కూడా రాయటం గమనార్హం.
గుజరాత్ వెళ్లిన పన్నీర్
ఇదిలా ఉండగా సోమవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం హాజరయ్యారు. ఈ సందర్భంగా భాజపా అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన తనయుడు, అన్నాడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్కుమార్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్, పుదియనీతి కట్చి అధ్యక్షుడు ఏసీ షణ్ముగం తదితరులు వెంట ఉన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డాతో కొంతసేపు మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటన ఈపీఎస్ వర్గానికి మింగుడు పడటం లేదు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈపీఎస్కు ఎడప్పాడికి ఆహ్వానం అందినా అతను పాల్గొనకపోవటం గమనార్హం. దీని గురించి పళనిస్వామి వర్గ నేతల సమాచారం ప్రకారం.. కార్యక్రమానికి ఓపీఎస్ను కూడా తనకు సరిసమానంగా ఆహ్వానించడంతో అసంతృప్తికి లోనైనట్లు తెలిపారు. దీనికి సంబంధించి పళనిస్వామి గుజరాత్ ముఖ్యమంత్రికి పంపిన శుభాకాంక్షల లేఖలో.. ముందే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయం కేటాయించినందున ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నానని తెలిపారు. నిజానికి సోమవారం ఎడప్పాడికి చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ లేకపోవడం గమనార్హం.
పళనిస్వామి కోపం అందుకే..
దీంతో భాజపా చర్యలకు ప్రతిచర్యలుగా పళనిస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలుస్తోంది. దీనికి కారణం భాజపా పెద్దలు ఈపీఎస్ను కలిసి మాట్లాడేందుకు ఆసక్తి కనబరచకపోవటమేనని సమాచారం. గతంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు పార్టీలో ఎడప్పాడి పాల్గొన్నప్పుడు మోదీ, అమిత్షాలు మాట్లాడేందుకు సమయం కేటాయించలేదు. అలాగే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఈపీఎస్ కలిసేందుకు సమయం ఇవ్వలేదు. ప్రధానికి స్వాగతం పలికే సమయంలో ఈపీఎస్, ఓపీఎస్లను పిలిచి ఒక్కచోట నిలబెట్టి స్వాగతం స్వీకరించారు. ఇది కూడా ఎడప్పాడి వర్గానికి అసంతృప్తిని కలిగించింది. దీంతో కోపానికి గురైన ఎడప్పాడి అమిత్షా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చినప్పుడు హాజరవలేదు. భాజపా నేతలు వచ్చినప్పుడల్లా కలవాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అన్నాడీఎంకే నేతృత్వంలో మెగా కూటమి అని ప్రకటించారు. దీన్ని భాజపా పెద్దలు ఎలా తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల జీ-20 సదస్సు ఆలోచన సమావేశానికి ఎడప్పాడి పళనిస్వామిని ఆహ్వానించటంతో భాజపా ఈపీఎస్ వైపు మొగ్గు చూపుతుందనే వార్తలు వచ్చాయి. సమావేశంలో పాల్గొన్న పళనిస్వామికి ప్రధాని మోదీ, అమిత్షాలు ప్రత్యేకంగా కలిసేందుకు సమయం కేటాయించకపోవటం గమనార్హం. దీంతో ఓపీఎస్తో సంబంధాలు పెట్టుకుంటే తమతో సంబంధాలు కుదరవని ఓ భాజపా సీనియర్ నేతతో ఎడప్పాడి తెగేసి చెప్పి చెన్నైకి తిరిగి వచ్చినట్లు సమాచారం.
ఎడప్పాడి పళనిస్వామి
అంతుచిక్కని భాజపా వైఖరి
ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓపీఎస్ పాల్గొన్నారు. అప్పుడు భాజపా అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆ ఫొటోలను చూస్తుంటే వారి మధ్య భేటీ సజావుగా సాగినట్లు తెలుస్తోంది. దీంతో ఎడప్పాడి వర్గం మరింత అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓపీఎస్, భాజపా నేతల భేటీ తర్వాత త్వరలో అన్నాడీఎంకేకు సంబంధించి ముఖ్య ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైనా భాజపా పెద్దల మద్దతు ఓపీఎస్కా, ఈపీఎస్కా అనే గందరగోళం కొనసాగుతోంది. దీంతో మున్ముందు అన్నాడీఎంకే వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో, ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం ఏంటి అనే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి