వంటలు తెచ్చిన వెలుగు!
హిజ్రాలు మునుపుటిలా కాదు. వారి జీవితాలు నెమ్మదిగా వెలుగు దిశగా పయనిస్తున్నాయి. అన్ని రంగాల్లోకీ వస్తున్నారు. ఇప్పుడు రుచికర వంటకాలు చేసిపెట్టే రంగంలోకీ వచ్చారు.
హిజ్రాల జీవితాల్లో కొత్త ఆశలు
వారి నిర్వహణలో చెన్నైలో రెస్టారెంట్
శిక్షణ పొందిన బృందం
హిజ్రాలు మునుపుటిలా కాదు. వారి జీవితాలు నెమ్మదిగా వెలుగు దిశగా పయనిస్తున్నాయి. అన్ని రంగాల్లోకీ వస్తున్నారు. ఇప్పుడు రుచికర వంటకాలు చేసిపెట్టే రంగంలోకీ వచ్చారు. హిజ్రాలతోనే నడిచే చెన్నైలోని తొలి రెస్టారెంట్ ‘చెన్నై ట్రాన్స్ కిచెన్’ తాజాగా ప్రారంభమైంది. వారి వంటకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలో మూడో ట్రాన్స్ రెస్టారెంట్ను తాజాగా చెన్నైలోనూ ఏర్పాటు చేశారు. ఇదివరకు కోయంబత్తూరు, మదురైలో ప్రారంభించారు. చెన్నైలో మాత్రం ఇదే మొదటిది. కొలత్తూరు జీకేఎం కాలనీ, 25వ వీధిలో పది మంది హిజ్రాలు ఏకమై రుచుల వేదికను తెరిచారు. దక్షిణాది, శాకాహార, మాంసాహార, చైనీస్ వంటకాలతోనూ ఆకట్టుకుంటున్నారు. యునైటెడ్ వే ఆఫ్ చెన్నై, స్వస్తి స్వచ్ఛంద సంస్థలు వీరికి తోడ్పాటు అందిస్తున్నాయి. హిజ్రాల హక్కుల సంఘం వెన్నుదన్నుగా నిలవడంతో ఓ బ్యాంకు వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో రెస్టారెంట్ పెట్టేందుకు ఆర్థిక సాయం అందించారు. అందరి సహకారంతో హిజ్రాలు ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి.
తమ జీవితాల్ని మార్చుకోవాలనే ఆసక్తి హిజ్రాల్లో పెరిగింది. కేవలం వారితోనే రెస్టారెంట్ పెడుతున్నామని తెలిసినప్పుడు.. 80 మంది ముందుకొచ్చారు. వారి నుంచి స్వచ్ఛంద సంస్థలు పది మందిని ఎంపికచేశాయి. ఇందులో హిజ్రాలుగా మారిన ఆడవారు, మగవారు ఇరువురూ ఉన్నారు. మూడు నెలల ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. వంటల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆత్మవిశ్వాసం పెరిగింది. వారిపై మంచి ఉద్దేశం పెంచేందుకు ఈ రెస్టారెంట్ను చక్కటి అవకాశంగా తీసుకుని ముందుకెళ్తున్నారు.
ఆదాయం మెరుగు
గతంలో ఉపాధి, సరైన గౌరవం లేదు. జీవితమంటే రోడ్లపైనే అన్నట్టు ఉండేది. అలాంటివారు ఇప్పుడు రెస్టారెంట్ నడుపుతున్నారు. రుచికర వంటకాలు వండుతూ, చకచకా సరఫరా చేస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు. ఎందురికో హిజ్రాలకు వీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒక్కొక్కరూ నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పొందనున్నారు. నగరంలో ఇలాంటి వాటిని మరికొన్ని తెరవాలనే ఆలోచనలో సంస్థ ప్రతినిధులున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇలాంటి ఓ రెస్టారెంట్ నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు.
కన్నీళ్ల నుంచి బయటకు..
ఈ రెస్టారెంట్లో కీలకపాత్ర పోషిస్తున్న సంజన గాథ వింటే చాలా బాధకు గురిచేస్తుంది. చిన్నతనం నుంచి చెన్నైతోపాటు ముంబయి, పుణె వీధుల్లో తిరిగారు. యాచక వృత్తిలోనూ ఉన్నారు. అన్నేళ్లు ఎలా బతికానో కూడా తలచుకుంటే భయంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు గౌరవప్రదంగా జీవనం సాగిస్తున్నారు. వంట మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బిర్యానీ చేయడంలో దిట్ట. హిజ్రాల హక్కుల సంఘం తనని అక్కున చేర్చుకుందని, అందువల్లే తనకిది సాధ్యమైందని చెప్పారు. మరో హిజ్రా పేరు.. దయ. పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు రెస్టారెంట్లో చేరారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ.
మరింత అవగాహన
హిజ్రాల హక్కుల సంఘం అధ్యక్షులు ఆర్.జీవా మాట్లాడుతూ.. ‘హిజ్రాలు అన్నిరంగాల్లోనూ స్ఫూర్తినిస్తూ వెళ్తున్నారు. చెన్నై ట్రాన్స్ కిచెన్ ద్వారా వారి ప్రతిభ బయటికి వస్తోంది. ఉపాధి పెరుగుతోంది. యాచక వృత్తి, వ్యభిచారం నుంచి చాలామందిని వివిధ రంగాల్లోకి తీసుకురావాలనేది మా సంకల్పం. ఇందులో భాగంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. తమ సంఘంలో ఇప్పుడు 400 మంది హిజ్రాలున్నారని, వారందరికీ ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సమాజంతో కలిసి..
సామాజిక దురాలోచల్ని దూరం చేసి వారిని కూడా సమాజంలోకి సమాన స్థాయిలో బతికేలా చేయడానికి ఈ రెస్టారెంట్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని స్వస్తి ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. ప్రయత్నం చేస్తే ఈ సామాజిక వర్గానికి కూడా ఉపాధికి కొదవలేదని చెప్పడానికి స్ఫూర్తిగా చూపెడుతున్నామని అన్నారు. అంతకుముందు కమ్యూనిటీ కిచెన్ పేరుతో కరోనా సమయంలో హిజ్రాలు స్వయంగా వంటలు చేసి ఎంతోమందికి ఉచితంగా ఆహారాన్ని అందించారు. నగరవాసుల మన్ననలు పొందారు. ఇప్పుడూ అలాంటి మార్గంలోనే నడుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న