భాజపాకిదే చివరి యాత్ర: బాలకృష్ణన్
అన్నామలై యాత్రే భాజపా ప్రభుత్వానికి చివరి యాత్రగా ఉండనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ అన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలకృష్ణన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: అన్నామలై యాత్రే భాజపా ప్రభుత్వానికి చివరి యాత్రగా ఉండనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ అన్నారు. మదురైలోని పళంగానత్తంలో మంగళవారం సీపీఎం, డీఎంకే కూటమి పార్టీల తరఫున ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు కేటాయించి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఎంపీలు వెంకటేశన్, మాణిక్యం దాసూర్, నవాస్కణి, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా నిధులు కేటాయించలేదన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర మోదీ ప్రభుత్వానికి చివరి యాత్రగా మారనుందని చెప్పారు. గవర్నర్ తీరు సరిగా లేదని విమర్శించారు. ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మదురై ఎయిమ్స్కు మొదటి విడత నిధులు కేటాయించాలన్నారు. సేతు సముద్ర ప్రాజెక్ట్ను కూడా వెంటనే నెరవేర్చాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.