logo

ద్వితీయస్థానంలో చెన్నై మహిళ

దక్షిణ భారతదేశ స్థాయిలో జరిగిన ‘మిసెస్‌ సౌత్‌ ఇండియా’ పోటీల్లో చెన్నైకి చెందిన మహిళ రెండో స్థానంలో నిలిచింది.

Published : 25 Jan 2023 00:05 IST

వైశాలి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశ స్థాయిలో జరిగిన ‘మిసెస్‌ సౌత్‌ ఇండియా’ పోటీల్లో చెన్నైకి చెందిన మహిళ రెండో స్థానంలో నిలిచింది. పెగాస్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో అందాల పోటీలు జరిగాయి. తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు పాల్గొన్నారు. మూడు దశలుగా జరిగిన ఈ పోటీల్లో ఫైనల్‌కు 14 మంది వచ్చారు. వారిలో చెన్నైకి చెందిన ఎస్‌ వైశాలి ద్వితీయస్థానంలో నిలిచారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లయిన తర్వాత కూడా మహిళలు పలురంగాల్లో రాణిస్తున్నారు. అలా ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకతను చాటుకోవాలి. ఇప్పటికే నేను పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా. ఇప్పుడు ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉంది. క్యాన్సర్‌ బాధితుల కోసం 2018లో నేను నా జుట్టును దానంగా ఇచ్చా. అలాగే ఉదయనిధి నటించిన ‘కలగ తలైవన్‌’లో కూడా ఓ పాత్ర పోషించా. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాన’ని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని