logo

‘గవర్నర్‌ రాజీకి వస్తే మేలు’

ప్రభుత్వంతో గవర్నర్‌ రాజీకి వస్తే మంచిదని కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈరోడ్‌ తూర్పు ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓట్లు తమకే పడతాయన్నారు.

Published : 27 Jan 2023 00:44 IST

విలేకరులతో మాట్లాడుతున్న కార్తి చిదంబరం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వంతో గవర్నర్‌ రాజీకి వస్తే మంచిదని కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈరోడ్‌ తూర్పు ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓట్లు తమకే పడతాయన్నారు. తమ పార్టీ, కమల్‌హాసన్‌ రాజకీయ సిద్ధాంతాలు ఒక్కటేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమిలో ఎంఎన్‌ఎం చేరే అవకాశం ఉందన్నారు. సీట్లు కేటాయించడంలో డీఎంకేదే నిర్ణయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్‌ రాజీకి వస్తే మంచిదని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని