logo

కార్పొరేషన్‌ సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత

చెన్నై కార్పొరేషన్‌ కార్యాలయమైన రిబ్బన్‌ భవనంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్‌ ప్రియ జాతీయ జెండాను ఎగురవేశారు.

Published : 27 Jan 2023 00:44 IST

జెండా వందనం చేస్తున్న మేయర్‌ ప్రియ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై కార్పొరేషన్‌ కార్యాలయమైన రిబ్బన్‌ భవనంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్‌ ప్రియ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎన్‌సీసీ విద్యార్థుల కవాతును స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన కార్పొరేషన్‌ సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందించారు. పాఠశాల విద్యార్థులు తయారుచేసిన పలు ఆవిష్కరణల ప్రదర్శనను మేయర్‌ వీక్షించారు. విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మహేష్‌కుమార్‌, జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌బేడీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని