logo

పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అభినందనలు

పద్మ భూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన ఆరుగురికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందనలు తెలిపారు.

Published : 27 Jan 2023 00:44 IST

చెన్నై, న్యూస్‌టుడే: పద్మ భూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన ఆరుగురికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో.. రాష్ట్రం నుంచి పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన గాయని వాణీ జయరాం, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కల్యాణ సుందరం పిళ్లై (ఆర్ట్స్‌), పాములు పట్టే నిపుణుడు వడివేల్‌ గోపాల్‌, మాశి సడైయన్‌ (సామాజిక సేవ), పాలం కల్యాణసుందరం (సామాజిక సేవ), గోపాల్‌స్వామి వేలుస్వామి (వైద్యరంగం)లకు అభినందనలు తెలిపారు. దేశ అత్యున్నత పురస్కారాలు పొందనున్న వారందరూ చేసిన కృషితో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు.  

గవర్నర్‌ రవి తన ట్వీట్‌లో... రాష్ట్ర ఇరుళర్‌ సామాజిక వర్గానికి చెందిన పాములు పట్టే నిపుణుడు వడివేల్‌ గోపాల్‌, మాశి సడైయన్‌లకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం హర్షణీయమని తెలిపారు. విలువైన పలు ప్రాణాలను కాపాడిన అరుదైన పాము విషాలను సేకరించడంలో వారిద్దరూ సహకరించారని తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన రాష్ట్రానికి చెందిన ఇతరులకూ శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని