‘వెన్నుపోటుదారులకు గుణపాఠం తప్పదు’
వెన్నుపోటు పొడిచే వారికి ఈరోడ్ ఉప ఎన్నిక గుణపాఠం నేర్పుతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయపడ్డారు.
ప్రసంగిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి
విల్లివాక్కం, న్యూస్టుడే: వెన్నుపోటు పొడిచే వారికి ఈరోడ్ ఉప ఎన్నిక గుణపాఠం నేర్పుతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయపడ్డారు. ఈరోడ్లో శుక్రవారం ఈస్ట్ నియోజకవర్గ అన్నాడీఎంకే ఎన్నికల నిర్వాహకుల సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో విజయఢంకా మోగించాలని, ప్రజలు ప్రశంసించే స్థాయిలో నిర్వాహకులు పనిచేయాలని సూచించారు. ఇద్దరు మహా నేతలు నేర్పించిన రాజకీయాన్ని ఈ నియోజకవర్గంలో ఉపయోగించి చరిత్ర సృష్టించాలని పేర్కొన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆ పార్టీ వారే ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. డీఎంకే నాయకులు సంకుచిత మనస్తత్వంతోనే ఓట్లు సేకరించగలరని, అన్నాడీఎంకే నేతలు ధైర్యంగా ఆ పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎంకే భారీ ప్రాజెక్టులేమీ చేపట్టలేదని ఆరోపించారు. అన్నాడీఎంకే అమలు చేసిన తాళికి బంగారం, వివాహ భృతి పథకాలను ప్రభుత్వం నిలిపేసిందని ఆరోపించారు. నియోజకవర్గ అధికారులు 3 రోజుల్లో ఓటర్ల వివరాలు సరిచూసుకోవాలని కోరారు. తమ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు శత్రువులతో కలిసి కొందరు వెన్నుపోటుదారులుగా మారి పని చేస్తున్నారని తెలిపారు. వారికి ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఒక గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డారు.
అన్నాకు నివాళి 3న
సైదాపేట: ఫిబ్రవరి 3న దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి నివాళులర్పించనున్నారు. దీనికి సంబంధించి అన్నాడీఎంకే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... పేరరింజ్ఞర్ అన్నా 54వ స్మారక దినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3న చెన్నై మెరీనాలోని ఆయన స్మారక మందిరంలో ఎడప్పాడి మాల వేసి నివాళులు అర్పించనున్నారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నిర్వాహకులు, పాల్గొనాలని సూచించింది. అలాగే పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3న ఆయా ప్రాంతాల్లో అన్నా విగ్రహాలు, చిత్ర పటాలకు మాలవేసి నివాళులర్పించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు