అన్నాడీఎంకే శ్రేణులకు దిశానిర్దేశం
ఈరోడు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతలు ఎలా వ్యవహరించాలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పలు సూచనలు చేశారు.
ఇంటింటికీ వెళ్లాలని ఎడప్పాడి ఆదేశం
ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహం
మద్దతుదారులతో ఓపీఎస్ సమావేశం
సైదాపేట, న్యూస్టుడే: ఈరోడు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతలు ఎలా వ్యవహరించాలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పలు సూచనలు చేశారు. ఈరోడు తూర్పు ఎన్నికలు ఇంకా నెల రోజులే ఉన్న నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈరోడు పార్టీ నిర్వాహకులతో చర్చించారు. ముఖ్యంగా పార్టీ నేలు ఎలా వ్యవహరించాలో ముఖ్య సూచనలు చేశారు. రెండాకుల గుర్తు దక్కకపోయినా ఎన్నికల్లో ఆధిపత్యం సాధించాలనే కృతనిశ్చయంతో ఎడప్పాడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి తరఫున శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రెండాకుల గర్తు తమకు ఇవ్వాలని, ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపితే ఎన్నికల కమిషన్ తనకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కింద సంతకాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తుందని తెలిపారు. పళనిస్వామి దూకుడైన రాజకీయాలకు ఇది నిదర్శనంగా ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఓటర్లకు చెప్పాలని పార్టీ నిర్వాహకులకు సూచించారు. 32 వార్డుల్లో విభజించి ఇచ్చిన ప్రాంతానికి రోజూ వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ మళ్లీ వెళ్లాలని సూచించారు. ప్రజలకు నిజాలను తెలపాలని, డీఎంకే నెరవేర్చని ఎన్నికల హామీలను వారి దృష్టికి తేవాలని ఆదేశించారు. ఇక్కడ 17 శాతం మాత్రమే గౌండర్లు, 36 శాతం కొంగు ముదలియార్లు, 17 శాతం మైనారిటీలు, 6 శాతం అరుంధతీయులు ఉన్నారు. గౌండర్ల ఓట్ల కంటే మిగతా వారివే ఎక్కువ. ముఖ్యంగా కొంగు ముదలియార్లు విజయాన్ని నిర్ణయించే శక్తిగా ఉన్నారు. అందులో 80 వేల ఓట్లు పొందితే అభ్యర్థి విజయం సాధించినట్లే. ఎలాగైనా వాటిని పొందాలని శుక్రవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సెంగోట్టయన్ పేరొన్నారు. మరోవైపు 111 మందితో కూడిన ఎన్నికల పనుల బృందాన్ని ఎడప్పాడి నియమించారు.
పన్నీర్ వర్గం అభ్యర్థి ఎవరో?
మురుగానందం
ఈరోడు తూర్పు ఉప ఎన్నికలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తన మద్దతుదారులతో శనివారం సమావేశం అయ్యారు. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే నుంచి ఈరోడు తూర్పు జిల్లా కార్యదర్శి ఆనంద్, ఏఎంఎంకే తరఫున శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ చెన్నై గ్రీన్వేస్ రోడ్డులోని తన నివాసంలో మద్దతుదారులతో శనివారం భేటీ అయ్యారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే ప్రాతిపదికన తన సంతకంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును ఎన్నికల కమిషన్ అంగీకరించటం లేదని పళనిస్వామి సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. సోమవారం మళ్లీ అప్పీలు చేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఓపీఎస్ మద్దతుదారుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండాకుల గుర్తు కేటాయించాలని ఎడప్పాడి కోర్టును ఆశ్రయించటంతో తదుపరి చర్యల గురించి ఓపీఎస్ ఆలోచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయటంపైనా చర్చించినట్లు సమాచారం. ఈరోడు నగర విద్యార్థి విభాగ కోశాధికారిగా ఉన్న మురుగానందం కొన్ని నెలల క్రితం ఓపీఎస్ వర్గంలో చేరారు. ఆయనకు ఈరోడు నగర జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. అభ్యర్థి పేరును పన్నీర్సెల్వం త్వరలో ప్రకటిస్తారని నాయకులు అన్నారు. ప్రస్తుతం బూత్ కమిటీల ఏర్పాటుపై నివేదిక ఓపీఎస్కు చేరిందని వివరించారు. త్వరలో ఎన్నికల బాధ్యులను నియమించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. బల నిరూపణలకు అన్నాడీఎంకేలోని ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ప్రత్యక్షంగా తలపడుతుండటంతో ఈరోడు ఉప ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు