పెరుగుతున్న కూలీల ఆత్మహత్యలు
రోజువారీ కూలీల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న నివేదిక దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడులో అసంఘటిత రంగ కార్మికులకు ఎక్కవ కూలీ ఇస్తున్నారు.
వ్యసనాలు, ఆన్లైన్ జూదం కూడా కారణం
సక్రమంగా అమలు కాని సంక్షేమ పథకాలు
సైదాపేట, న్యూస్టుడే: రోజువారీ కూలీల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న నివేదిక దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడులో అసంఘటిత రంగ కార్మికులకు ఎక్కవ కూలీ ఇస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో రాజ్యసభ సమావేశంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్ సింగ్, నీరజ్ డాండి తదితరులు ప్రశ్న లేవనెత్తారు. దీంతో రాష్ట్రాల వారిగా కూలీల ఆత్మహత్యల గణాంకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అందులో గతేడాదిలో మాత్రమే తమిళనాడులో 7,673 మంది కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీనికి కారణం సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందకపోవడమేనని తేలింది. అసంఘటిత రంగ కార్మికుల భద్రతా చట్టం 2008 ప్రకారం వ్యవసాయం, భవన నిర్మాణం, ఇంటి పని తదితర పనులు చేసే వారి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సెలవు, పింఛనుకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సక్రమంగా అవి అమలు కావడం లేదు. 2021లో మాత్రమే దేశవ్యాప్తంగా 42,004 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ జాబితాలో నాలుగేళ్లుగా తమిళనాడు మొదటి స్థానంలో ఉందనేది దిగ్భ్రాంతికర విషయం.
ప్రభుత్వమే స్పందించాలి
దీని గురించి భాతర కార్మిక సంఘ సెంటర్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కన్నన్ మాట్లాడుతూ... ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడు అసంఘటిత కార్మికులకు ఎక్కువ కూలీ ఇస్తుండటం వాస్తవమేనని తెలిపారు. అయితే కేరళ, జమ్ముకశ్మీర్ తదితరాలతో పోల్చితే తక్కువని అన్నారు. ఐదేళ్లుగా ధరల పెరుగుదలను గమనిస్తే దానికి నికరంగా కూలీ లేక వేతనం పెంచలేన్నదే వాస్తవమని తెలిపారు. అందరు కూలీలకు సరాసరిగా నెలకు రూ.21,000 ఆదాయం దక్కాలని సంఘం కోరుతోందన్నారు. మూడేళ్లుగా రోజువారీ కూలీల నెల ఆదాయం రూ.18,000లకు పెంచాలని ప్రభుత్వం వద్ద ఉంచిన డిమాండే ఇంకా నెరవేర్చలేదని తెలిపారు. దీనికి సంబంధించి తమిళనాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అధ్యక్షుడు పొన్.కుమార్ మాట్లాడుతూ... కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోజువారీ కూలీల ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని తెలిపారు. వ్యసనాలు, కరోనా లాక్డౌన్, ఆన్లైన్ జూదం, అప్పుల బాధలు తదితరాలే దీనికి కారణమన్నారు. ఈ కారణంగానే ఆన్లైన్ జూదం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల మరణాల వివరాలు జిల్లా స్థాయిలో నమోదు చేస్తామని అన్నారు. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన జిల్లాల వారీగా అధ్యయనం చేసి నిజాలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని