logo

డీఎండీకే అభ్యర్థి నామపత్రాల దాఖలు 31న

ఈరోడ్డు (తూర్పు) నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎండీకే అభ్యర్థి ఈనెల 31వ తేదీ మంగళవారం తన నామపత్రాలను దాఖలు చేయనున్నారు.

Published : 29 Jan 2023 01:32 IST

ఆనంద్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: ఈరోడ్డు (తూర్పు) నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న డీఎండీకే అభ్యర్థి ఈనెల 31వ తేదీ మంగళవారం తన నామపత్రాలను దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో డీఎండీకే తరఫున ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ కోశాధికారి ప్రేమలత పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయాన్ని తెలిపారు. అభ్యర్థిగా ఆనంద్‌ను పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ ఖరారు చేశారు. ఆ మేరకు పార్టీ అభ్యర్థి ఆనంద్‌ ఈనెల 31వ తేదీన నామపత్రాలు దాఖలు చేస్తారని అధిష్ఠానం ప్రకటించింది. ఆనంద్‌ తరఫున పార్టీ కోశాధికారి ప్రేమలత, ఉప కార్యదర్శి సుదీష్‌ తదితరులు ప్రచారంలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని