నల్లకన్నుకు మంత్రి పరామర్శ
శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి మా.సుబ్రమణియన్ వద్ద నల్లకన్ను కోరారు.
నల్లకన్నుతో మాట్లాడుతున్న సుబ్రమణియన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి మా.సుబ్రమణియన్ వద్ద నల్లకన్ను కోరారు. సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను అనారోగ్యం కారణంగా చెన్నై రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ శనివారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అప్పుడు శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, నర్సులు లేరని, అందువలన వైద్యులు, నర్సులను నియమించాలని మంత్రిని నల్లకన్ను కోరారు. అనంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి భార్య తల్లి కన్యాకుమారికి యాత్ర కోసం వచ్చినప్పుడు అనారోగ్యంతో చెన్నై రాజీవ్గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆమెను మంత్రి పరామర్శించారు. రెండ్రోజుల్లో కోలుకుంటారని మంత్రి మా.సుబ్రమణియన్ ఉత్తరప్రదేశ్ మంత్రి ఫోన్లో సమాచారం ఇచ్చారు. సీర్గాళికి చెందిన బాలిక అభినయ అరుదైన జన్యు వ్యాధి కారణంగా రెండు కాళ్లు దెబ్బతిని చికిత్స పొందుతుంది. బాలికను మంత్రి పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...కాళ్లను కోల్పోకుండా మరలా నడవగలుగుతున్నట్లు బాలిక ఆనందం వ్యక్తం చేసిందన్నారు. నెల తర్వాత రూ.లక్ష విలువైన పాదరక్షలు వేసుకోనుందని చెప్పారు. శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బంది లేరని, అక్కడ వైద్యులు, నర్సులను నియమించాలని నల్లకన్ను కోరారన్నారు. ఇప్పటికే వైద్యుల నియామకం చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్