ఆర్థిక రంగంలో బలపడాలి: మంత్రి
ఆర్థిక రంగ కార్యకలాపాల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు.
మాట్లాడుతున్న పళనివేల్ త్యాగరాజన్
సైదాపేట, న్యూస్టుడే: ఆర్థిక రంగ కార్యకలాపాల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు. తమిళనాడు ఆడిట్ కార్యాలయం తరఫున సహాయ ఆడిట్ ఇన్స్పెక్టర్లకు 5 రోజుల కోర్సు అన్నా వర్సిటీలో జరుగుతోంది. అధికారుల పనితీరు పెంచేందుకు చెన్నై మండల శిక్షణ సంస్థ తరగతులు నిర్వహిస్తోంది. శిక్షణను పళనివేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో అన్నా వర్సిటీతో కలిసి శాశ్వత తరగతులు నిర్వహించటం గురించి అధ్యయం చేస్తున్నామన్నారు. ఆర్థిక రంగ కార్యకలాపాల్లో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తమిళనాడు ఉండాలన్నారు. దీనికి అధికారులు సహకరించాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించటమే ప్రస్తుతం తమ పనని ఆర్థిక శాఖ మంత్రి పళనివేలు త్యాగరాజన్ తెలిపారు. ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా తమిళనాడు పేరిట అసోచాం తరఫున మంగళవారం ఏర్పాటైన సదస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తోందని తెలిపారు. గతేడాది బడ్జెట్ తర్వాత రాష్ట్ర అభివృద్ధి బాగుందన్నారు. నాన్ ముదల్వర్ తదితర పథకాలు దాని కొనసాగింపుగా ప్రారంభించినవేనని పేర్కొన్నారు. 2011-22లో రాష్ట్ర జీడీపీˆ చాలా తగ్గిందన్నారు. అన్నాడీఎంకే పాలన, రాజకీయాలకు అతీతమైనవి కారణమని తెలిపారు. గతేడాది బడ్జెట్లో చాలా అంచనాలు ఉన్నాయని, ఈ సారి అలా ఉండవన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించటమే ప్రస్తుతం మన ముందు ఉన్న పనని పేర్కొన్నారు. ఇలాంటి సదస్సులు దానికి దోహదపడతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్