ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా
ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు తమకు కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎడప్పాడి పళనిస్వామి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
8 పకడ్బందీ ఏర్పాట్లలో ఎడప్పాడి
సైదాపేట, న్యూస్టుడే: ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు తమకు కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎడప్పాడి పళనిస్వామి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని ఆయన కోరారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తాను పంపే అభ్యర్థిని ఎన్నికల కమిషన్ అంగీకరించాలని సూచించాలని సుప్రీం కోర్టులో ఎడప్పాడి తరఫు పిటిషన్ వేశారు. మూడు రోజుల్లో బదులివ్వాలని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ సమాధానం పళనిస్వామికి అనుకూలమా? కాదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనుకూలంగా ఉంటే ఎడప్పాడికి రెండాకుల గుర్తు దక్కుతుంది. అయితే సర్వసభ్య సమావేశ కేసు తీర్పును వాయిదా వేసి ఉన్న నేపథ్యంలో ఈసీ ఇలా చెప్పడం కష్టమేనని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇద్దరూ పోటీ చేయాలని భావిస్తే రెండాకుల గుర్తును తాత్కాలికంగా స్తంభింపచేసి వారికి నచ్చిన గుర్తులను ఎంపిక చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పే అవకాశాలే ఎక్కువని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎడప్పాడికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, నిర్వాహకుల మద్దతు ఉన్నా ఓపీఎస్ కూడా అదేస్థాయిలో పోరాడుతున్నది. రెండాకులు గర్తు దక్కకపోతే ఎన్నికల కమిషన్లో వేరే దాన్ని ఎంపిక చేసేందుకు పళనిస్వామి తరఫున చర్చించుకుంటున్నారు. ఇంతులో చేతి బండి గుర్తును ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. తొళిలాలి సినిమాలో ఎంజీఆర్ ఆ బండి లాగే కార్మికుడిగా నటించారు. దీంతో ఆ గుర్తును ఎంపిక చేసుకుంటే సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చనేది ఎడప్పాడి ఆలోచన.
అవకాశాలు ఇవే..
ఈ నేపథ్యంలో మూడు సానుకూల అంశాలు తమకు ఉన్నట్లు ఎడప్పాడి తరఫు వర్గం భావిస్తోంది. మొదటిది రెండాకుల గుర్తు దక్కితే తామే నిజమైన అన్నాడీఎంకే అని నిరూపించొచ్చని ఎడప్పాడి తరఫు వర్గం భావిస్తోంది. ఇకవేళ గుర్తు స్తంభిస్తే దీనికి ఓపీఎస్ కారణమని, డీఎంకే బీ టీమ్గా పని చేస్తూ సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ప్రచారం చేయాలన్నది ఎడప్పాడి వర్గం ఆలోచన. దీంతో ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతుందని ఈపీఎస్ వర్గ అంచనా. అదే సమయంలో రెండాకుల గుర్తుతో విజయం సాధించటం కంటే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల మద్దతు పొందితే బలమైన నాయకుడిగా మారొచ్చనేది ఈపీఎస్ ఆలోచన. దీంతో బూత్లవారీగా వివరాల్లో పళనిస్వామి మునిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!