రైళ్ల వేగం పెంపునకు చర్యలు
దక్షిణ రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్ను బలోపేతం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
వడపళని, న్యూస్టుడే: దక్షిణ రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్ను బలోపేతం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. చెన్నై నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణంలో సమయం కలిసొచ్చేలా పనులు జరుగుతున్నాయని దక్షిణ రైల్వే గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి బెంగళూరుకు రైళ్ల వేగం పెరగనుంది. చెన్నై నుంచి జోలార్పేట్టై సెక్షనులో గంటకు 130 కి.మీ వేగం వరకు వెళ్లనున్నాయి. ప్రస్తుతం వందేభారత్ బెంగళూరుకు 4.25 గంటలు, శతాబ్ది ఎక్స్ప్రెస్ 4.45 గంటలలోపు చేరుకుంటున్నాయి. పెరగనున్న వేగంతో సమయం మరో అరగంట వరకు తగ్గనుంది. ఆ తర్వాత జోలార్పేట్టై నుంచి బెంగళూరు వరకు ట్రాక్ మరమ్మతులు, బలోపేతం పనులు పూర్తి కాగానే ప్రయాణ సమయం ఇంకా తగ్గుతుంది. ఇక్కడ పనులు ముగిసిన తర్వాత బెంగళూరులోని సౌత్ వెస్టర్న్ రైల్వే కమిషనరు చెన్నై - రేణిగుంట వయా అరక్కోణం, అరక్కోణం - జోలార్పేట్టై సెక్షనులో 130 కి.మీ వరకు అనుమతి ఇవ్వగానే వేగంతో నడుస్తాయన్నారు. ఈ మార్గానికి ఉన్న దూరం 144.54 కి.మీ. చెన్నై నుంచి జోలార్పేట్టై వరకు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 120 కి.మీ వరకు నడిచే వీలుంటుంది. అదేవిధంగా చెన్నై నుంచి ముంబయి మార్గంలో నడిచే రైళ్లు కూడా రేణిగుంట వరకున్న 134.78 కి.మీ దూరానికి వేగంతో నడిచే వీలుంది. వేగాన్ని పెంచి నడిపేందుకు ఇప్పటికే సంబంధిత అధికారుల అనుమతికోసం దక్షిణ రైల్వే లేఖ రాసింది. అరక్కోణం - జోలార్పేట్టై మార్గానికి వచ్చే నెల మొదటి వారంలో రైల్వే సేఫ్టీ కమిషనరు నుంచి అనుమతి అందే అవకాశం ఉంది.
* చెన్నై - గూడూరు సెక్షనులో అక్టోబరులోనే 130 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. జోలార్పేట్టై - పొదనూరు, చెన్నై - దిండిగల్లు సెక్షనులో కూడా 130 కి.మీ వేగంతో నడిచేందుకు పనులు జరుగుతున్నాయి. ఇవికాకుండా ఇతర ప్రధాన మార్గాల్లో కొన్ని రైళ్లకు 110 కి.మీ వరకు నడిచేందుకు దక్షిణ రైల్వే జోన్లో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల చెన్నై - అరక్కోణం సెక్షనులో 90 నుంచి 110 కి.మీ వేగంతో నడిపారు. అదేవిధంగా తాంబరం - చెంగల్పట్టులో 90 నుంచి, తిరునెల్వేలి - తిరుచెందూరు సెక్షనులో 70 నుంచి 110 కి.మీ వరకు పెంచారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల పట్టాల వెంబడి గోడలు కట్టాలనుకుంటున్నట్లు దక్షిణ రైల్వే సీనియర్ అధికారి ఒకరన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM