అన్నదమ్ముళ్ల దారుణ హత్య
నామ్ తమిళర్ కట్చికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్ మున్సిపల్ కాలనీ కృష్ణస్వామి వీధికి చెందిన లోకనాథన్ కుమారులు గౌతం (30), కార్తి (26) గానుగ నూనె, మసాలా పొడి తదితర వస్తువులు తయారు చేసి ఇంట్లోనే విక్రయిస్తుంటారు.
విల్లివాక్కం, న్యూస్టుడే: నామ్ తమిళర్ కట్చికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్ మున్సిపల్ కాలనీ కృష్ణస్వామి వీధికి చెందిన లోకనాథన్ కుమారులు గౌతం (30), కార్తి (26) గానుగ నూనె, మసాలా పొడి తదితర వస్తువులు తయారు చేసి ఇంట్లోనే విక్రయిస్తుంటారు. వీరికి మామ ఆరుముగస్వామితో పాత కక్షలున్నాయి. సెల్ఫోన్లో మాట్లాడుకుంటున్న సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గౌతం, కార్తి ఇంటికి వచ్చిన ఆరుముగస్వామి గొడవకి దిగాడు. కాసేపటి తర్వాత అన్నదమ్ములపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఆరుముగస్వామి కోసం గాలిస్తున్నారు.
నగల కోసం దంపతుల హతం
ప్యారిస్, న్యూస్టుడే: దంపతులను హత్య చేసి నగలు దోచుకున్న ఘటన పెరంబలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పెరంబలూరు జిల్లా వెప్పంతట్టై సమీప తొండప్పాడి గ్రామానికి చెందిన మాణిక్కం (75), మాక్కాయి (70) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. ఇంట్లో మాణిక్కం, మాక్కాయి మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. మంగళవారం ఉదయం గొంతు కోసిన స్థితిలో ఇద్దరు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. మృతదేహాలపై కారంపొడి చల్లి ఉంది. ఇంట్లో 6 సవర్ల నగలు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
తల్లీకుమారుల ఆత్మహత్య
ఆర్కేనగర్, న్యూస్టుడే: ఓ ఇంట్లో తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... మదురై జిల్లా కొచ్చడై ప్రాంతానికి చెందిన ఉమాశంకర్ (46) షేర్ మార్కెట్ సంబంధిత సంస్థ నడుపుతున్నాడు. ఇతను తొలిభార్య నుంచి విడిపోయి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో ఆమె కూడా తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఉమాశంకర్ తన తల్లి విజయలక్ష్మి (73)తో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో విషం తాగి వారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమాశంకర్ ఫోను చేస్తే సమాధానం ఇవ్వకపోవడంతో సంస్థలోని ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM