యువత సవాళ్లను స్వీకరించాలి: గవర్నర్
సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు గవర్నర్ ఆర్.ఎన్.రవి సూచించారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తిరిగొచ్చిన నేపథ్యంలో గిండీలోని రాజ్భవన్లో వారిని గవర్నర్ సత్కరించారు.
ప్రసంగిస్తున్నఆర్ఎన్ రవి
చెన్నై, న్యూస్టుడే: సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు గవర్నర్ ఆర్.ఎన్.రవి సూచించారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తిరిగొచ్చిన నేపథ్యంలో గిండీలోని రాజ్భవన్లో వారిని గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఉన్నత సేవలు రాష్ట్రం, దేశం గర్వించేలా ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగతంగా, సమష్టిగా విజయం సాధించడం స్ఫూర్తికి ఫలితమని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలని ఆకాంక్షించారు. నేడు అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వించదగిన స్థానాన్ని కలిగి ఉందన్నారు. వివిధ సమస్యలపై ప్రపంచ దేశాలు మన విధానాలపై శ్రద్ధ చూపుతున్నాయని తెలిపారు. మాంద్యాన్ని అధిగమించడానికి అభివృద్ధి, వృద్ధి కోసం జరుగుతున్న పరుగులో ప్రపంచ దేశాల మధ్య భారత్ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభాన్ని పరిష్కరించి తమను నడిపించాలనే ఆశతో పలు దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపారు. ఆ అంచనాలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత దేశంపై ఉందన్నారు. సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. కలలు పెద్దవిగా కనాలని, వాటిని సాధించడానికి కృషి చేస్తే ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. సవాలులేని జీవితం వ్యాయామంలేని శరీరం వంటిదన్నారు. కార్యక్రమంలో భాగంగా గణతంత్ర దినోత్సవ శిబిరంలోని తమ అనుభవాన్ని ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పంచుకున్నారు. ఎన్సీసీ డైరెక్టరేట్ (టీఎన్పీఏఎన్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అతుల్ కుమార్ రస్తోగి, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఈశ్వరమూర్తి, గవర్నర్కు ముఖ్యకార్యదర్శి ఆనందరావు వి.పాటిల్, అన్నా విశ్వవిద్యాలయం ఉపకులపతి వేల్రాజ్, తమిళనాడు ఎన్ఎస్ఎస్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ సి.సామువేల్ చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం