నామపత్రాల దాఖలుకు ప్రధాన పార్టీల సన్నాహాలు
ఈనెల 27న ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. డీఎంకే కూటమి తరపున కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఓపీఎస్ వర్గం, డీఎండీకే, ఏఎంఎంకే, నామ్ తమిళర్ కట్చి వంటి ముఖ్యమైన పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించారు.
నామినేషన్ వేస్తున్న మేనకా నవనీతన్
విల్లివాక్కం, న్యూస్టుడే: ఈనెల 27న ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. డీఎంకే కూటమి తరపున కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఓపీఎస్ వర్గం, డీఎండీకే, ఏఎంఎంకే, నామ్ తమిళర్ కట్చి వంటి ముఖ్యమైన పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించారు. గతనెల 31 నామినేషన్ల దాఖలు ప్రారంభం కాగా మొదటి రోజు 10 మందికి పైగా స్వతంత్ర అభ్యర్ధులు వినూత్న రీతిలో నామ పత్రాలు దాఖలు చేశారు. ఇందులో 6 నామపత్రాలు సక్రమంగా లేకపోవడంతో అధికారులు తిరష్కరించారు. రెండు రోజుల్లో మొత్తం 10 నామపత్రాలు ఆమోదించారు. గురువారం నామ్ తమిళర్ పార్టీ కట్చి అభ్యర్ధి మేనకా నవనీతన్ నామ పత్రం దాఖలు చేశారు. శుక్రవారం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, ఏఎంఎంకే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముందస్తు చర్యలుగా ఈరోడ్ టౌన్ డీఎస్పీ ఆనంద్కుమార్ నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా పనులు చేపడుతున్నారు. ఒకేరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు నామ పత్రాలు దాఖలు చేస్తున్నందున అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నామ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరి రోజుగా నిర్ణయించారు. 8వ తేదీ పరిశీలిన, 10వ తేదీ ఉపసంహరణ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు