logo

‘అన్నివర్గాల అభివృద్ధిని కోరేలా బడ్జెట్‌’

అన్నివర్గాల అభివృద్ధిని కోరేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశివాయం తెలిపారు.

Updated : 03 Feb 2023 05:34 IST

విలేకర్లతో మాట్లాడుతున్న నమశివాయం

చెన్నై, న్యూస్‌టుడే: అన్నివర్గాల అభివృద్ధిని కోరేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశివాయం తెలిపారు. భాజపా పుదుచ్చేరి ప్రధాన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పుదుచ్చేరికి రూ.3,124 కోట్లు కేటాయించారని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఆర్థికాభివృద్ధి తదితర అవసరాలకు ఈ నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు. బడ్జెట్‌లో అన్నివర్గాల ప్రజలకు నిధులు కేటాయించారని తెలిపారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందని, తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు దస్త్రాలకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇస్తోందని చెప్పారు. సమావేశంలో మంత్రి సాయి శరవణన్‌కుమార్‌, భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు స్వామినాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని