ప్రైవేటు పాఠశాలలకు కొత్త నిబంధనలు
ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం నూతన నిబంధనలు ప్రకటించింది. ప్రయివేటు నర్సరీ, మెట్రిక్యులేషన్ పాఠశాలలకు 50 సంవత్సరాల తర్వాత నిబంధనల్లో మార్పు చేసింది.
వడపళని, ప్యారిస్, న్యూస్టుడే: ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం నూతన నిబంధనలు ప్రకటించింది. ప్రయివేటు నర్సరీ, మెట్రిక్యులేషన్ పాఠశాలలకు 50 సంవత్సరాల తర్వాత నిబంధనల్లో మార్పు చేసింది. విద్యార్థుల ప్రవేశాలు, పాఠశాలల గుర్తింపులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని గురువారం తెలిపింది. ప్లేస్కూళ్లకు డిపాజిట్ కింద రూ.50 వేలు, నర్సరీ, ప్రైమరీకి అయితే రూ.లక్ష, మాధ్యమిక పాఠశాలకు రూ.2 లక్షలు, హయ్యర్ సెకండరీ పాఠశాలలకయితే రూ.3 లక్షలు డిపాజిట్లుగా చెల్లించాలి. పాఠశాలల గుర్తింపుకోసం ప్రత్యేక ఫీజు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పుస్తకాలనే తప్పనిసరిగా వాడాలి. ప్లే స్కూళ్లలో చేరే వారికి కనీసం రెండేళ్లు, ఎల్కేజీకి మూడు, యూకేజీకి నాలుగు, ఒకటో తరగతికి కనీసం ఐదేళ్ల వయసుండాలి. జులై 31వ తేదీ నాటికి ఉన్న వయసును పరిగణనలోకి తీసుకోవాలి. గుర్తింపు పొందిన ఏ పాఠశాలనుంచైనా బదిలీ ధ్రువపత్రాలతో మరో బడిలో విద్యా సంవత్సరంలో చేరవచ్చు. మైనార్టీ కమ్యూనిటీ బడుల్లో కాకుండా, మిగిలిన బడుల్లో రిజర్వేషన్ కోటాను తప్పనిసరిగా అమలు చేయాలి. ఒక్కొక్క పాఠశాలలో కౌన్సిల్ అధ్యాపకులు, సిబ్బంది ఉండాలి. కౌన్సిల్ కోసం ఉన్న సభ్యుల వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేయాలి. విద్యార్థుల ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించేందుకు కౌన్సిల్ బాధ్యత వహించాలి.
ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగా ప్రయివేటు బడుల ఉపాధ్యాయులు కూడా శిక్షణకు హాజరుకావాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్స్ సమక్షంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బందితో ఒక సర్వీస్ కమిటీ ఉండాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు నేరాలకు పాల్పడితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ప్రీకేజీలో 15, ఎల్కేజీ నుంచి అయిదో తరగతి వరకు 30, 6 నుంచి 8 తరగతులకు 35, 9 నుంచి 12 (ప్లస్టూ) వరకు 40 మంది విద్యార్థులుండాలి.
ప్రత్యేక తరగతులు నిషేధం
పరీక్ష ఫలితాలకు ముందుగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకూడదు. విద్యార్థుల్లో ఎవరైనా చదువులో వెనుకబడి ఉంటే అటువంటి వారిని నిరుత్సాహపరచి, పరీక్ష రాయకుండా చేయకూడదు. సరైన హాజరు లేకుండా ఉన్న వారిని మాత్రమే పరీక్షలు రాసేందుకు అనుమతించకూడదు. ప్లస్వన్, ప్లస్టూ విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు చేరాలని ఒత్తిడి చేయకూడదు. నియమ నిబంధనలు పాటిస్తూ వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ