ఐఐటీఎం విద్యార్థులకు కార్గిల్ ఉపకారవేతనం
యూఎస్ గ్లోబల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ సంస్థ ‘కార్గిల్’, ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) బీఎస్ డిగ్రీ చదివే వారికి ఉపకారం వేతనం అందించేందుకు చేతులు కలిపింది.
ఒప్పంద పత్రాలతో మనుసంతానం, సుమిత్ గుప్తా
వడపళని, న్యూస్టుడే: యూఎస్ గ్లోబల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ సంస్థ ‘కార్గిల్’, ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) బీఎస్ డిగ్రీ చదివే వారికి ఉపకారం వేతనం అందించేందుకు చేతులు కలిపింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల విద్యార్థులైన వంద మందికి డాటా సైన్స్ అండ్ అప్లికేషన్స్లో బీఎస్ కోర్సు చేస్తే ఉపకార వేతనం ఉపయోగకరంగా ఉండనుంది. అభ్యర్థుల విద్యా నైపుణ్యాలకు అనుగుణంగా ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. ఏడాదికి 7,500 మంది ఈ కోర్సులో చేరుతున్నారు. వీరిలో 25 నుంచి 30 శాతం మంది విద్యార్థులు ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఉన్నారని ఐఐటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆచార్యులు మనుసంతానం, భారత్లోని కార్గిల్ బిజినెస్ సర్వీసెస్ సంస్థ కంట్రీ హెడ్ సుమిత్ గుప్తా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 2020 జూన్లో ప్రారంభమైన బీఎస్ డాటా సైన్స్ కోర్సు ఇప్పటివరకు ఆరు అకడమిక్ సీజన్లు పూర్తి చేసుకుని, మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఈ కోర్సులో 22 వేల మంది చేరి విజయవంతంగా పూర్తి చేశారు. వీరిలో 17 వేల మంది నైపుణ్యంతో రాణించగా, 195 మంది డిగ్రీ స్థాయి, 4,500 పైచిలుకు మంది డిప్లొమా సాధించారు. కార్గిల్ సంస్థ ఉపకార వేతనాలందించేందుకు ముందుకు రావడం పట్ల డీన్, ఆచార్యులు మహేష్ పంచగ్నుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరే వారిలో ఎక్కువ మంది మొదటిసారిగా డిగ్రీలో చేరుతున్నవారే అధికం. వీరి తల్లిదండ్రులు దినసరి కార్మికులు, రైతులు లాంటి జీవనోపాధితో కాలం వెళ్లదీస్తున్నారని పంచగ్నుల అన్నారు. సుమిత్ గుప్తా మాట్లాడుతూ... ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాల వారికి ఐఐటీతో కలిసి ఉపకార వేతనం అందించడం గర్వకారణంగా ఉందన్నారు.
ఉపకారవేతనం అందుకున్న విద్యార్థులతో ఐఐటీ, కార్గిల్ ప్రతినిధులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా