మూగబోయిన సుస్వరాల ‘వాణి’
ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు... పద్మవిభూషణ్ స్థాయికి ఎదిగారు.. పురస్కారం స్వీకరించకముందే కన్నుమూశారు ప్రముఖ సినీ గాయని వాణీ జయరామ్.
కోడంబాక్కం, న్యూస్టుడే: ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు... పద్మవిభూషణ్ స్థాయికి ఎదిగారు.. పురస్కారం స్వీకరించకముందే కన్నుమూశారు ప్రముఖ సినీ గాయని వాణీ జయరామ్. చెన్నైలో శనివారం ఆమె అందరి నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు విషాదంతో మునిగారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. మంచం నుంచి జారిపడి గాయాలైనందువల్లే ఆమె కన్నుమూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. సినీ, సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీరనిదన్నారు.
ప్రముఖుల సంతాపం
చెన్నై, న్యూస్టుడే: గాయని వాణీ జయరామ్ మృతికి సీఎం స్టాలిన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. స్టాలిన్ తన సందేశంలో... భారత చలనచిత్ర రంగంలో సంగీత కోకిలగా విరాజిల్లిన కలైవాణి అలియాస్ వాణీ జయరామ్ మృతి ఆవేదన కలిగించిందని తెలిపారు. వేలూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన మధుర గానంతో ప్రసిద్ధి గాంచారని పేర్కొన్నారు. తమిళం తదితర 19 భాషల్లో 10 వేలకుపైగా అద్భుత పాటలు పాడి అభిమానుల మనసులో చెరగని స్థానం పొందారని తెలిపారు. ఇటీవల ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించినప్పుడు శుభాకాంక్షలు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి ముందే ఈ లోకాన్ని వీడటం బాధాకరమని తెలిపారు. ఆమె మృతి సంగీత లోకానికి తీరని లోటు అన్నారు. ఆమెను కోల్పోయిన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాణీ జయరామ్ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి స్వామినాథన్ తెలిపారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడం తదితర పలు భాషాల్లో 1 0వేలకుపైగా పాటలు పాడి ప్రత్యేక ముద్ర వేశారన్నారు. ఆమెను ‘సప్తస్వరాల గాన సరస్వతి’గా అభిమానులు పిలుచుకున్నారని తెలిపారు. ఆమె ‘అపూర్వ రాగంగళ్’, ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’ చిత్రాలకుగాను జాతీయ పురస్కారాలు పొందారని పేర్కొన్నారు.
దర్యాప్తు చేసి వెళుతున్న ఫోరెన్సిక్ అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం