వానియంబాడిలో విషాదం
తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వారపు సంత ప్రాంతంలో శనివారం జరిగిన చీరల టోకెన్ల పంపిణీ కార్యక్రమం విషాదానికి దారితీసింది.
తొక్కిసలాటలో నలుగురి మృతి
బంధువులతో కిక్కిరిసిన ఆసుపత్రి
ఘటనాస్థలంలో పెద్దఎత్తున గుమికూడిన మహిళలు
వేలూరు, న్యూస్టుడే: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వారపు సంత ప్రాంతంలో శనివారం జరిగిన చీరల టోకెన్ల పంపిణీ కార్యక్రమం విషాదానికి దారితీసింది. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఏకంగా 12 మంది గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వానియంబాడి పట్టణంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. మృతిచెందిన వారంతా కూలీ పనులు చేసుకుంటున్నవారే. మృతుల్లో నాగమ్మాళ్, రాజాత్తి, మల్లిక వితంతువులు. మరో మృతురాలు వళ్లియమ్మాళ్కు భర్త ఉన్నారు. మరోవైపు వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది మహిళల్లో వృద్ధులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 9 మంది వితంతువులు ఉన్నారు. తమ ఇంట్లో పెద్దదిక్కుగా ఉన్న మహిళల్ని కోల్పోవడం, ఇలా ఆసుపత్రి పాలవడంతో పెద్దఎత్తున బంధువులు వానియంబాడి ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి ప్రాంగణం కిక్కిరిసింది. రద్దీని నియంత్రించేందుకు, ఇతర ఆందోళనలేవీ జరగకుండా చూసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చీరల పంపిణీ నిర్వాహకుడు అయ్యప్పన్ను అరెస్టు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఈవీ వేలు వ్యక్తిగతంగా.. మృతుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎమ్మెల్యే దేవరాజ్ ఈ మేరకు ప్రకటించారు. జిల్లా కలెక్టరు అమర్ కుష్వాహా, డీఐజీ ముత్తుస్వామి, వానియంబాడి ఆర్డీఓ ప్రేమలత, జిల్లా ఎస్పీ బాలకృష్ణన్, తదితరులు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి, సంఘటన వివరాలను సేకరించారు. క్షతగాత్రులకు సరైన వైద్యమందేలా ఆరోగ్యశాఖ జేడీ మారిముత్తు పర్యవేక్షిస్తున్నారు.
ఆర్థిక సాయం ప్రకటన
చెన్నై, న్యూస్టుడే: విషాద ఘటన గురించి తెలిసి ఆవేదన చెందినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేల వంతున సీఎం సహాయ నిధి నుంచి అందించాలని ఆదేశించినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM