50 చోట్ల అదనంగా 200 కెమెరాలు
చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని పసిగట్టేందుకు చెన్నై మహానగర పోలీసు విభాగం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్’ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేసింది.
కూడలిలో ఏఎన్పీఆర్ కెమెరాలు
వడపళని, న్యూస్టుడే: చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని పసిగట్టేందుకు చెన్నై మహానగర పోలీసు విభాగం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్’ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేసింది. పెరిగి పోతున్న ట్రాఫిక్తో 50 ప్రాంతాల్లో అదనంగా 200 కెమెరాలు అమర్చడానికి టెండరు ఖరారు చేయనుంది. చోరీకి గురైన వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను ఈ కెమెరాలతో తేలికగా తెలుసుకునే వీలుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా సిగ్నళ్ల వద్ద నిలవకుండా వెళ్లిన వాహనాలు, సెల్ ఫోన్లలో మాట్లాడుతూ నడిపిన వారిని గుర్తించగలిగారు. ప్రస్తుతం 16 చోట్ల ‘ట్రాఫిక్ రెగ్యులేషన్ అబ్జర్వేషన్ జోన్’ (టీఆర్ఓజడ్) ప్రాజెక్టులో భాగంగా కెమెరాలతో సేవలు మరింత విస్తరించేందుకు ట్రాఫిక్ విభాగం సిద్ధమవుతోంది. 2018-19 కాలంలో ఉల్లంఘించిన వారికి చలాన్లు నేరుగా అందించి, జరిమానా వసూలు చేశారు. ఏఎన్పీఆర్ కెమెరాల ఆధారంగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘వాహన్’ పోర్టల్ నుంచి చలాన్లు వాహన యజమానులకు జారీ చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కెమెరాలతో నిబంధనలకు అతీతంగా నడిపే వారిని గుర్తించడంతో పాటు ‘ఇంటెలిజెంట్ వీడియో మేనేజ్మెంట్ సిస్టం’ (ఐవీఎంఎస్) కూడా పని చేస్తుంది. ఈ పరికరం ద్వారా మరింత నిశితంగా గమనించడం, గుర్తించడం, అప్రమత్తం చేయడంతోపాటు రోడ్లలో పార్కు చేసిన వాహనాలు చోరీకి గురైతే అది కూడా రికార్డు అవుతుంది. చోరీకి గురైన వాహనం రికార్డు అయిన తర్వాత ఆటోమేటిక్గా సమీపంలోని పోలీసు స్టేషన్లకు, ఇన్స్పెక్టర్లు, పై అధికారులకు వాయిస్ కాల్, సెల్ఫోనులో సందేశం, లేదా వాట్సాప్ ద్వారాగానీ సమాచారం అందుతుంది. 2017నుంచి గ్రేటర్ చెన్నై పోలీసు పరిధిలో ఏడాదికి సగటున 1,420 వాహనాలు చోరీకి గురి కావడమో లేక కనిపించకుండా పోవడమో జరుగుతున్నాయని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. చోరీకి గురైన వాహనాలతో గొలుసు, మొబైల్ ఫోన్లు, ఇతర దొంగతనాలకు వినియోగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో హత్యలు చేసి పారిపోయేందుకు కూడా ఈ తరహా వాహనాలను వాడుతున్నట్టు చెప్పారు. రద్దీ బాగా ఉండే ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కెమెరాలతో అరాచకాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుందని పోలీసులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పనసపండు గుర్తు ఎక్కడ?
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు