పోర్ట్ - మదుర వోయల్ మధ్య పైవంతెన పనులు పునఃప్రారంభం త్వరలో
పోర్టు నుంచి మదురవోయల్ వరకు నిర్మాణం జరగనున్న అతి పెద్ద పైవంతెన మార్గానికి జూన్ నుంచి పనులు పునః ప్రారంభం కానున్నాయి.
వడపళని, న్యూస్టుడే
పైవంతెన డిజైన్
పోర్టు నుంచి మదురవోయల్ వరకు నిర్మాణం జరగనున్న అతి పెద్ద పైవంతెన మార్గానికి జూన్ నుంచి పనులు పునః ప్రారంభం కానున్నాయి. దీనికి పదకొండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. పలు కారణాలతో పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, చెన్నై రేవుల అధికారులతో సమావేశాలు జరిగిన అనంతరం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహాదారు సంస్థ ‘ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ’ (ఏఈటీ) ఇటీవల అనుమతించింది. ఇప్పటికే నిర్మాణం జరిగిన స్తంభాల తీరుతెన్నులు పరిశీలించాలని పేర్కొంది. ఇన్నేళ్లు ఈ స్తంభాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఐఐటీ మద్రాస్ లేదా మంచి పేరున్న సంస్థతో స్తంభాలను పరిశీలించాలని సూచించింది.
* రూ. 5,721 కోట్లతో....: ఆరు వరుసలతో నిర్మాణం జరగనున్న ఈ భారీ ప్రాజెక్టుకు రూ. 5,721 కోట్ల వ్యయం కానుంది. మొదటి రెండు అంతస్తుల్లో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పయనిస్తాయి. పై అంతస్తులో మాత్రం ఓడ రేవుకు వెళ్లే వాహనాలు మాత్రమే తిరుగాడుతాయి. ఈ భారీ పైవంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎగ్మూరు, నుంగంబాక్కం, అరుంబాక్కం, కోయంబేడు ప్రాంతాల్లో రద్దీ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయని అంచనా. ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. 15 ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 60 నుంచి 90 వేల వరకు వాహనాలకు లబ్ది చేకూరనుంది. మార్గంలో అక్కడక్కడా కూవం నది కూడా ఉండటం, తొలుత నాలుగు లేన్ల పైవంతెనకు అనుకూలంగా డిజైన్ చేయడంతో 2010లో డీఎంకే హయాంలోనే రూ. 1,815 కోట్ల వ్యయంతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ స్తంభాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించాలని కమిటీ ఆదేశించింది. అవసరమైతే డిజైన్లో మార్పుచేర్పులు కూడా చేయాలని పేర్కొంది. అనంతరం 2012లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక పర్యావరణ స్థితులపై ప్రాజెక్టులో జాప్యం జరిగింది. కూవం మార్గంలో 375 స్తంభాల వరకు నిర్మాణం కావాల్సి ఉందని, పునాదులు కూవం లోపలి నుంచి నిర్మాణం కావాలని జలమండలి పేర్కొంది. అన్ని అనుమతుల తర్వాత అది కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని చెన్నై పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ సునీల్ పాలివాల్ పేర్కొన్నారు. 2023 జనవరిలో ‘కోస్టల్ రెగ్యులేటరీ క్లియరెన్స్’ (సీఆర్జడ్) నుంచి కూడా అనుమతి లభించింది.
కూవం వద్ద నిర్మితమైన స్తంభాలు
* టెండర్ల ఆహ్వానం: 2022 సెప్టెంబరులోనే ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్హెచ్ఏఐ) దీనికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెలాఖరులో ఖరారు చేసే ఆస్కారముంది. ఎన్హెచ్ఏఐ, తమిళనాడు ప్రభుత్వం, రేవు, ఇతర కేంద్ర ఏజెన్సీల మధ్య 2022 మే నెలలో ఒప్పందాలు కూడా కుదిరాయి. చింతాద్రిపేట, నుంగంబాక్కంలో రైల్వే లైనుపైన నిర్మాణం జరగాల్సి ఉంది. కనుక దక్షిణ రైల్వే నుంచి అనుమతికోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ‘టీఎన్ లారీ ఓనర్స్ అసోసియేషన్’ (టీఎన్ఎల్ఓఏ) ప్రతినిధి ఎస్.యువరాజ్ మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుతో చెన్నై రేవుకు ఆదాయం బాగా సమకూరే వీలుందన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రయివేటు రేవులకు ఆదాయం చేకూరగలదని, టెండర్ల ఆహ్వానాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులు పూర్తయి త్వరలో కార్యరూపం దాల్చడం హర్షణీయమన్నారు. పైవంతెనల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్, ప్రమాదాలు కూడా బాగా తగ్గుతాయని పేర్కొన్నారు.
నేపియర్ బ్రిడ్జి వద్ద జరగనున్న నిర్మాణానికి నావికా విభాగానికి చెందిన 120 మీటర్ల స్థలం అవసరం ఉంది. ఈ ప్రాంతంలో క్వార్టర్సు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనులు ప్రారంభమైన ఏడాదికి సైదాపేటలో 64 ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి అంతస్తు (టైర్ 1)లో పెరియార్ బ్రిడ్జి - ఎగ్మూరు - అరుంబాక్కం - కోయంబేడు వరకు 14 కిలోమీటర్ల పొడవు మేర నిర్మాణం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!