స్కేటింగ్లో దూసుకెళ్తున్న విద్యార్థిని
చదువు ఒక్కటే ఒకరి అభివృద్ధికి సరిపోదు. దానితోపాటు అదనంగా ప్రతిభ ఉండాలి. అందులోనూ క్రీడా ప్రతిభ చాలా ముఖ్యమైనది.
జాతీయ స్థాయిలో రికార్డు
స్కేటింగ్ చేస్తున్న రబియా సకియా
ఆర్కేనగర్, న్యూస్టుడే: చదువు ఒక్కటే ఒకరి అభివృద్ధికి సరిపోదు. దానితోపాటు అదనంగా ప్రతిభ ఉండాలి. అందులోనూ క్రీడా ప్రతిభ చాలా ముఖ్యమైనది. చెన్నైకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని రబియా సకియా కూడా ఇలాంటి ఆలోచనతోనే వ్యక్తిగత స్కేటింగ్ క్రీడలో పలు విజయాలు సాధిస్తోంది. 44 కి.మీ. దూరాన్ని గంట 46 నిమిషాల్లో దాటి ప్రపంచ రికార్డు సృష్టించింది. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విజయ విశేషాల గురించి విద్యార్థిని మాటల్లోనే.... ‘‘మెరినా సముద్రతీరానికి వెళ్లినప్పుడు అక్కడ కొందరు పిల్లలు స్కేటింగ్ శిక్షణ తీసుకోవడాన్ని చూశాను. అప్పుడే స్కేటింగ్ చేయాలని ఆశపడ్డాను. ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణకు పంపారు. వారి సహకారంగానే అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించగలిగాను. ఆరేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. గెలుపు కోసం కోచ్ సతీష్రాజ సహకారం అందించారు. ఇప్పటివరకు 40కు పైగా పోటీల్లో పాల్గొన్నాను. 25 బంగారు పతకాలు గెలుచుకున్నాను. జాతీయ స్థాయిలో రెండు బంగారు, రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లా స్థాయిలో 18 పసిడి పతకాలు వచ్చాయి. ఏదైనా కొత్తగా సాధించాలని ఆశపడ్డాను. దీన్ని అర్థం చేసుకున్న స్కేటింగ్ అకాడమీ అవకాశాలు ఇచ్చింది. స్కేటింగ్ ద్వారా ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో దాటి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించా. ఆరునెలలుగా సిద్ధమయ్యాను. ప్రారంభంలో 44 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్ చేస్తూ గంట 45 నిమిషాల్లోపు విరామం లేకుండా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రికార్డు సృష్టించడానికి చాలానే కష్టపడ్డాను. 12 వంతెనలు దాటుకొని వెళ్లడం కఠినంగా సాగింది. చివరి వంతెనను దాటేసమయానికి చాలా అలసిపోయాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను. అందుకే ఈ రికార్డుని సాధించగలిగాను. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పోటీలు ప్రారంభమయ్యాయి. వాటి కోసం సిద్ధమవుతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి మరింత పేరు తెచ్చిపెట్టాలనేదే నా లక్ష్యం.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?