అన్నాడీఎంకేలో కొనసాగుతున్న గందరగోళం
ఈపీఎస్ తరఫున చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు లేదని ఓపీఎస్ వర్గానికి చెందిన సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ తెలిపారు.
తమిళ్మగన్ హుస్సేన్ తీరుపై ఓపీఎస్ వర్గం నిరసన
సమావేశంలో జేసీటీ ప్రభాకర్, వైద్యలింగం, రామచంద్రన్
సైదాపేట, న్యూస్టుడే: ఈపీఎస్ తరఫున చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు లేదని ఓపీఎస్ వర్గానికి చెందిన సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ తెలిపారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల వ్యవహారంలో అన్నాడీఎంకేలో ఈపీఎస్ వర్గం తరఫున కేఎస్ తెన్నరసు, ఓపీఎస్ వర్గం తరఫున సెంథిల్మురుగన్లను అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రెండాకులు గుర్తు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థిని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్మగన్ హుస్సేన్ ఓపీఎస్ సహా అందరు సర్వసభ్య సభ్యులకు తెన్నరసుకు మద్దతు కోరుతూ లేఖ పంపారు. దీని గురించి ఓపీఎస్ వర్గం ఆదివారం సమావేశం జరిపింది. తర్వాత ఓపీఎస్ వర్గ సీనియర్ నిర్వాహకులు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగంలు సంయుక్తంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు వైద్యలింగం మాట్లాడుతూ... తెన్నరసును మాత్రమే అన్నాడీఎంకే అధికారపూర్వకంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని తెలిపారు. సర్వసభ్య సమావేశం మాత్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపిందన్నారు. అలాంటప్పుడు ప్రిసీడియం చైర్మన్ తమిళ్మగన్ హుస్సేన్ ముందస్తుగానే ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం తగదని తెలిపారు. అంటే వారు ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే చర్యని మండిపడ్డారు. వేరే అభ్యర్థులను ప్రతిపాదించే ఎలాంటి అంశమూ ఈ లేఖలో లేదన్నారు. తాము ప్రకటించిన అభ్యర్థి పేరు కూడా లేదన్నారు. ఇతర పోటీదారుల హక్కును కాదనే అధికారం తమిళ్మగన్ హుస్సేన్కు లేదన్నారు. పళనిస్వామి వర్గ ఏజెంట్లా ఆయన వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తటస్థంగా తీర్పు ఇచ్చినా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రెండాకుల గుర్తు ఎక్కడ ఉంటుందో వారికి మద్దతు ఇస్తామని తెలిపారు. బన్రూటి రామచంద్రన్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పిందన్నారు. తమిళ్మగన్ హుస్సేన్ అభ్యర్థిని ప్రకటించి దానికి ఓటింగ్ జరుపుతున్నట్లు ఉందన్నారు. తాము దీనిని అంగీకరించమని అన్నారు. న్యాయ నిపుణలతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓపీఎస్ వర్గ ఈ నిర్ణయంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయటం దాదాపు అసాధ్యమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండాకులు గుర్తు స్తంభించేందుకే ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ తమిళ్మగన్ హుస్సేన్ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సభ్యులు ఇచ్చిన లేఖలను ఎన్నికల సంఘం దగ్గర సోమవారం సమర్పిస్తారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM