logo

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు... కోయంబత్తూరు నుంచి కుంభకోణానికి ఆదివారం మధ్యాహ్నం  ప్రభుత్వ బస్సు బయలుదేరింది.

Published : 06 Feb 2023 00:49 IST

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు... కోయంబత్తూరు నుంచి కుంభకోణానికి ఆదివారం మధ్యాహ్నం  ప్రభుత్వ బస్సు బయలుదేరింది. తిరుప్పూర్‌ జిల్లా వెల్లకోవిల్‌ సమీపం వెల్లమడై వద్ద వ్యాను ఢీకొంది. వ్యానులో పెళ్లి చూపులకు వెల్లకోవిల్‌కు వచ్చి తిరుగు వెళ్తున్న ఆరుగురిలో ముగ్గురు మృతి చెందారు. వెల్లకోవిల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో ఒకరు...

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: మంగాపురం కాలనీకి చెందిన విష్ణు(38) తిరుత్తణిలో కేబుల్‌ టీవీ ఉద్యోగి. శనివారం రాత్రి పూనిమాంగాడు మేటుకాలనీకు చెందిన రైతు శేఖర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై మద్దూరుకెళ్లారు. ఇంటికి వస్తున్న సమయంలో ట్రాక్టర్‌ ఢీకొంది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స ఫలించక విష్ణు మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.


బంగారు నగల చోరీ

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: స్థానిక వీఎం నగర్‌ సమీపం సమారియాస్‌ నగర్‌లో కార్తికేయన్‌ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో మణవాళనగర్‌ వెళ్లారు. శనివారం రాత్రి వచ్చేసరికి తాళం పగిలిఉంది. బీరువాలోని 30 సవర్ల బంగారు నగలు చోరీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని