కంప్యూటర్ అధ్యాపకులకు వెసులుబాటుకు వినతి
వడపళని, ప్యారీస్, న్యూస్టుడే: కంప్యూటర్ సబ్జెక్టు బోధించేందుకు నిబంధనల్లో సడలింపులు చేయాలని రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలలు ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (ఏఐసీటీఈ)ని అభ్యర్థించాయి.
వడపళని, ప్యారీస్, న్యూస్టుడే: కంప్యూటర్ సబ్జెక్టు బోధించేందుకు నిబంధనల్లో సడలింపులు చేయాలని రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలలు ‘ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ (ఏఐసీటీఈ)ని అభ్యర్థించాయి. ‘ఈఈఈ’, ‘ఈసీఈ’ బ్రాంచిల వారికి బోధన అందిస్తున్న వారికే కంప్యూటర్ సబ్జెక్టు కూడా నేర్పించేందుకు అనుమతించాలని కోరాయి. కంప్యూటర్ సైన్సు, సంబంధిత కోర్సుల్లో యూజీ, పీజీ ఉన్న వారే ‘సీఎస్ఈ’ బ్రాంచి చదువుతున్న ఇంజినీరింగు విద్యార్థులకు తరగతులు తీసుకునేందుకు వీలుందని ఏఐసీటీఈ నిబంధనలో ఉంది. దీనిపై పలువురు విద్యా నిపుణులు ఏమంటున్నారంటే...గత ఏడాది సగం మంది మేరకు విద్యార్థులు సీఎస్ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్సు కోర్సులను ఎంపిక చేసుకున్నారు. కొన్నేళ్లుగా బీఈ, బీటెక్ కోర్సులకు డిమాండు బాగా ఉండటంతో కొద్ది మాత్రమే ఎంఈ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలపై ఆసక్తి చూపించారు. కళాశాలలు కూడా ఎక్కువయ్యాయని, కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువైందని, బోధకుల సంఖ్య 20 నుంచి 30శాతం వరకు తక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈఈఈ, ఈసీఈ సబ్జెక్టుల్లో బోధించే అధ్యాపకులనే కంప్యూటర్ సంబంధిత కోర్సులు నేర్పించేందుకు అనుమతించాలని ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపామని కన్సార్టియం ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రొఫెషనల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల డిప్యూటీ కార్యదర్శి ఆర్ఎం కిశోర్ పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్సు ప్రవేశపెట్టిన సమయంలో ఈఈఈ, ఈసీఈ అధ్యాపకులే బోధించే వారని కూడా గుర్తు చేశారు. కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ పి.దైవ సుందరి మాట్లాడుతూ ఇతర విభాగాల అధ్యాపకులే కంప్యూటర్ సబ్జెక్టులో ప్రోగ్రామింగ్, ఏఐ, డాటా సైన్సు, గణితం, స్టాటిస్టిక్స్ సంబంధించిన అంశాలను బోధించగలరన్నారు. నైపుణ్యానికి సంబంధించిన పలు ఆన్లైన్ కోర్సుల్లో కూడా అధ్యాపకులు బోధించగలరని సుందరి చెప్పారు. కంప్యూటర్ సైన్సు అధ్యాపకులకు వేతనాలు కూడా పెరగలేదని, అది అమలైతే ఇతర సంస్థలనుంచి ఎక్కువమందిని తీసుకోగలమని రాజలక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ ఛైర్మన్ అభయ్ మేఘనాథన్ అన్నారు. కొన్ని కళాశాలలు ఆ రంగంలో నిపుణులైన వారిని వారాంతపు రోజుల్లో తరగతులు నిర్వహించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. ఎస్ఆర్ఎం వల్లియమ్మాళ్ ఇంజినీరింగు కళాశాల డైరెక్టర్ బి.చిదంబరరాజన్ మాట్లాడుతూ విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తిలో సడలింపులు చేస్తే బాగుంటుందనేది కొందరు ఆచార్యులు ఆలోచనగా ఉందన్నారు. అటానమస్ కళాశాలల్లో అధ్యాపకుల నిష్పత్తి 1:15, అనుబంధ కళాశాలల్లో అయితే 1:20గా ఉంది. దీన్ని ఏఐసీటీఐ 1:25 సడలింపులు చేస్తే అధ్యాపకుల కొరతను తీర్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సీఎస్ఈ బ్రాంచితో చదువుతున్న వారికి తరగతులు నిర్వహించేందుకు ఎంఈ, ఎంటెక్లో కంప్యూటర్ సైన్సు చదవాల్సిందిగా కొన్ని డీమ్డ్ వర్సిటీలు తమ అధ్యాపకులకు విన్నవించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట