logo

అన్నాదురైకు ఉదయనిధి నివాళులు

 మంత్రిగా  మొదటి సారి ఉదయనిధి స్టాలిన్‌ కాంచీపురానికి బుధవారం వచ్చారు. ఆయనకు నగర సరిహద్దుల్లో పార్టీ జిల్లా కార్యదర్శి, ఉత్తిరమేరూర్‌ ఎమ్మెల్యే కె.సుందర్‌, కాంచీపురం ఎమ్మెల్యే  ఎళిళరసన్‌, జిల్లా కోశాధికారి సన్‌ బ్రాండు కె.ఆర్ముగం తదితరులు స్వాగతం పలికారు.

Published : 09 Feb 2023 00:19 IST

  నివాళులు అర్పించిన మంత్రులు ఉదయనిధి స్టాలిన్‌, టీఎం అన్బరసన్‌ తదితరులు

కాంచీపురం, న్యూస్‌టుడే:  మంత్రిగా  మొదటి సారి ఉదయనిధి స్టాలిన్‌ కాంచీపురానికి బుధవారం వచ్చారు. ఆయనకు నగర సరిహద్దుల్లో పార్టీ జిల్లా కార్యదర్శి, ఉత్తిరమేరూర్‌ ఎమ్మెల్యే కె.సుందర్‌, కాంచీపురం ఎమ్మెల్యే  ఎళిళరసన్‌, జిల్లా కోశాధికారి సన్‌ బ్రాండు కె.ఆర్ముగం తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి అన్నాదురై స్మారక మందిరానికి చేరుకొన్న మంత్రులు ఉదయనిధి స్టాలిన్‌, టీఎం అన్బరసన్‌లను  కలెక్టరు ఎం.ఆర్తి, డీఆర్వో శివరుద్రయ్య, కాంచీపురం మేయర్‌ మహాలక్ష్మి యువరాజ్‌ తదితరులు స్వాగతించారు. అన్నాదురై విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంచీపురం ఆర్డీఓ కనిమొళి, ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శివషణ్ముగం, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉదయనిధి స్టాలిన్‌కు కాంచీపురం ఎమ్మెల్యే ఎళిలరసన్‌ వెండి ఖడ్గాన్ని బహూకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని