శరవేగంగా స్టేషను పునరాభివృద్ధి పనులు
కన్యాకుమారి స్టేషనులో పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. టోపోగ్రాఫికల్ సర్వే పూర్తయిందని దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సర్వే చేస్తున్న దృశ్యం
వడపళని, న్యూస్టుడే: కన్యాకుమారి స్టేషనులో పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. టోపోగ్రాఫికల్ సర్వే పూర్తయిందని దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మట్టి పరీక్షలు, స్టేషనులో పనులు 19 నెలల్లో పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. టెర్మినల్ భవనం పొడిగింపు, గ్రౌండు, మొదటి అంతస్తు, ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు సువిశాలమైన హాలు, పైనడక దారి వంతెనలు నిర్మాణం కానున్నాయి. తిరువనంతపరం - నాగర్కోయిల్ రైలు మార్గంలోని కన్యాకుమారి స్టేషను నిత్యం రద్దీతో ఉంటుంది. కన్యాకుమారి ఆలయం, వివేకాందన రాక్ మెమోరియల్, గాంధీ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు నిత్యం సందర్శకులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ స్టేషను దక్షిణ రైల్వే తిరువనంతపురం డివిజన్లో ఎన్ఎస్జీ 4 కేటగిరీలో చోటు సంపాదించింది. రూ. 49.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను చెన్నైలోని ‘ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్’ (ఈపీసీ) సంస్థకు అప్పగించారు. పనులను పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 802 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న టెర్మినల్ భవనంలో విశ్రాంత గదులు, టీటీఈకి విశ్రాంత గది, ఆహార శాలలు వంటివి మొదటి అంతస్తులోకి అందుబాటులోకి వస్తాయి. 5.0 మీటర్ల వెడల్పుతో పైనడక దారి వంతెన, పైనడక దారి వంతెన వద్ద రెండో ప్రవేశ ద్వారం నిర్మాణానికి ప్రతిపాదించినట్టు అధికారులు పేర్కొన్నారు. 104 కార్లు, 220 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు/ట్యాక్సీలు పార్కింగు చేసేందుకు వీలుగా నిర్మాణం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్