logo

‘హామీలను నెరవేర్చని ప్రభుత్వం’

మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ బుధవారం ఉదయం ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలోని 42వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.

Published : 09 Feb 2023 00:19 IST

టీ తయారుచేస్తున్న ఉదయకుమార్‌

విల్లివాక్కం, న్యూస్‌టుడే: మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ బుధవారం ఉదయం ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలోని 42వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఓ దుకాణంలో టీ తయారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవడానికి పాలక పక్షం ధన, అధికారబలాలతో ప్రయగ్నిస్తోందని పేర్కొన్నారు. తాము వాస్తవాన్ని చెప్పి ఎన్నికను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో ప్రజలకు ఖర్చు తడిసి మోపెడవుతోందని వాపోయారు. ప్రభుత్వంపై ప్రజల కోపం పెరిగిందన్నారు. పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ఈ ఉప ఎన్నిక దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని