logo

గురువులతో సఖ్యతగా నడచుకోవాలి

గుడియాత్తం సమీపం పళ్లికొండలో ఉన్న ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.

Published : 09 Feb 2023 00:19 IST

మాట్లాడుతున్న నటుడు దాము

వేలూర్‌, న్యూస్‌టుడే: గుడియాత్తం సమీపం పళ్లికొండలో ఉన్న ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రన్‌ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటుడు దాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాఠాలు బోధించేటప్పుడు శ్రద్ధగా వినాలన్నారు. అందులోని సారాంశం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఉపాధ్యాయులతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని