Panneerselvam: రహస్యాలు వెల్లడిస్తాం: ఓపీఎస్
ప్రజలనే న్యాయం కోరతామని, వారిని కలిసినప్పుడు పలు రహస్యాలు వెల్లడిస్తామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తెలిపారు.
సైదాపేట, న్యూస్టుడే: ప్రజలనే న్యాయం కోరతామని, వారిని కలిసినప్పుడు పలు రహస్యాలు వెల్లడిస్తామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తీర్పునకు సంబంధించి పన్నీర్సెల్వం, ఆయన మద్దతుదారులు శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు. అప్పుడు పన్నీర్సెల్వం మాట్లాడుతూ.. ప్రజలను ఆశ్రయించాల్సిన పరిస్థితిలో తాము ఉన్నామని తెలిపారు. ప్రజాకోర్టులో న్యాయం అడుగుతామన్నారు. జయలలితే అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని తెలిపారు. ఇది కార్యకర్తల పార్టీ అని పేర్కొన్నారు. తమ సేన బయలుదేరిందని, ప్రజాకోర్టులో మంచి తీర్పు దక్కుతుందని తెలిపారు. కోర్టు తీర్పుతో మాకు ఇబ్బంది లేదన్నారు. తాము ఎందుకు ప్రత్యేక పార్టీ పెట్టాలని ప్రశ్నించారు. పళనిస్వామి వర్గమే డీఎంకే బీ టీమ్ అని, వారి గురించి చెప్పాలంటే వేయి ఉన్నాయని తెలిపారు. ఇకపై ఒక్కొక్కటి బయటకు వస్తాయని అన్నారు. ప్రజలను కలిసినప్పుడు పలు రహస్యాలు బయట పెడతామని తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం అహంకారం పరాకాష్టలో ఉందని తెలిపారు. ఆ అహంకారాన్ని అణచివేసే శక్తి అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. త్వరలో జిల్లాల వారీగా పర్యటన చేస్తామన్నారు. తీర్పు ఎక్కడ ఉండాలో అక్కడ పొందుతామని పేర్కొన్నారు.
బన్రుట్టి రామచంద్రన్ మాట్లాడుతూ.. నీతి, న్యాయం తమ పక్కన ఉన్నాయన్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సర్వసభ్య సమావేశం చెల్లుతుంది, అయితే తీర్మానాల గురించి మాట్లాడబోమని చెప్పడం సుప్రీంకోర్టు బాధ్యతను విస్మరిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త సంతకం చేస్తేనే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తెలిపారు. మనోజ్పాండియన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో అప్పీలు లేదని, సర్వసభ్య సమావేశానికి సంబంధించి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చిందని, తీర్మానాల గురించి ఏమీ చెప్పలేదన్నారు. తీర్మానాల గురించి ఏమీ చెప్పలేదని తెలిపారు. తీర్మానాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపిందని పేర్కొన్నారు. దీని గురించి ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తీర్మానాలు చెల్లుతాయని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఈ కేసు సర్వసభ్య సమావేశానికి సంబంధించినదేనని, తీర్మానాలకు సంబంధించింది కాదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్