అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగితే రాజీనామా ఖాయం :అన్నామలై
అన్నాడీఎంకేతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగితే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల తరువాత అన్నాడీఎంకే, భాజపా మధ్య అంతరం పెరిగింది.
సమావేశంలో మాట్లాడుతున్న అన్నామలై
ప్యారిస్, న్యూస్టుడే: అన్నాడీఎంకేతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగితే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల తరువాత అన్నాడీఎంకే, భాజపా మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణగిరికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నాడీఎంకే నేతలను విమర్శించకూడదని చెప్పడంతో అన్నామలై, ఆయన మద్దతుదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చిత్రపటాన్ని భాజపా నేతలు దహనం చేయడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు అన్నామలైని విమర్శించారు. ఈ నేపథ్యంలో చెన్నైలో భాజపా నిర్వాహకులు, బూత్ కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ... అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగితే భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా ఉంటానని తెలిపారు. భాజపా ఒంటరిగా పోటీ చేస్తేనే తమిళనాడులో ప్రాబల్యం పెరుగుతుందన్నారు. సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీని సమయం కోరినట్లు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో మే 10వ తేదీ వరకు పార్టీ పనుల్లో బిజీగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ... అన్నామలై మాటలు స్పష్టంగా లేవని, వాటిని వివరించాలని అన్నారు. మదురైకి చెందిన పార్టీ నిర్వాహకుడు షా నారాయణన్ వెంటనే తిరుపతి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. చాలా మంది అన్నామలై మాటలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీలో చర్చించాల్సిన అంశంపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించడంతో కలకలం ఏర్పడింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గాంధీ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్