మెట్రో పనులకు సీఆర్డీఏ అనుమతి
మెట్రో రెండో దశలో మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్ వరకు జరగాల్సిన పనులకు ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అథారిటీ’ (సీఆర్జడ్ఏ) నుంచి ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్)కు అనుమతి లభించింది.
వడపళని, న్యూస్టుడే: మెట్రో రెండో దశలో మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్ వరకు జరగాల్సిన పనులకు ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అథారిటీ’ (సీఆర్జడ్ఏ) నుంచి ‘చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్)కు అనుమతి లభించింది. రెండో దశలో జరుగుతున్న మార్గంలో మూడు పొడవైన మార్గాలున్నాయి. మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్ వరకు 45.8 కి.మీ, లైట్ హౌజ్ నుంచి పూనమల్లి వరకు 26.1 కి.మీ, మాధవరం నుంచి షోలింనగల్లూరు వరకు 47 కి.మీ నిర్మాణం జరగనుంది. మైలాపూరు స్టేషను మూడు ప్లాట్ఫారాలతో నిర్మాణం జరుగుతుంది. 3, 4 లైన్ల నుంచి ఇంటర్ ఛేంజ్ వసతి ఉంటుంది. నేల మట్టానికి 35 మీటర్ల లోపల నాలుగు దశలుగా ఉంటుంది. ఈ పనుల కోసం సీఆర్జడ్ఏ నుంచి అనుమతి లభించిందని సీఎంఆర్ఎల్ పేర్కొంది. మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్ వరకున్న మార్గంలో 20 స్టేషన్లు పైన, 30 భూగర్భ మార్గంలో రానున్నాయి. అదేవిధంగా మైలాపూరు (తిరుమయిలై), ఇందిరా నగర్, తరమణి, బకింగ్హాం కెనాల్, అడయార్ నదిలో జరగాల్సిన పనులకు కూడా అనుమతి కోసం సీఎంఆర్ఎల్ లేఖ రాసింది.
* వర్క్షాపు పనులు వేగవంతం
మాధవరం, పూనమల్లిలో జరుగుతున్న వర్క్షాపు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని సీఎంఆర్ఎల్ పేర్కొంది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నిర్వహణ పనులు జరుగుతాయి. 2024 చివరికల్లా పనులు పూర్తయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల నిర్వహణ కోయంబేడు వర్క్షాపులో జరుగుతోంది. వింకోనగర్లో 20 ఎకరాల స్థలంలో నిర్వహణ కోసం జరుగుతున్న వర్క్షాపు నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.