ఆసియాలోనే పరిశ్రమల హబ్గా రాష్ట్రం
సాంకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్గా రాష్ట్రం మారనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఆశాభావం
వీసీ ద్వారా ప్రసంగిస్తున్న సీఎం
చెన్నై, న్యూస్టుడే: సాంకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్గా రాష్ట్రం మారనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార సాంకేతికశాఖ తరఫున నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో గురువారం జరిగిన సాంకేతిక, ఆవిష్కరణల ‘యుమాజిన్ శిఖరాగ్ర’ సదస్సును వీసీ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కలల ప్రాజెక్టును సాకారం చేసుకునే వేదికగా రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలని ఐటీ రంగ నిపుణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతలో ప్రపంచ దేశాలు పొందే అభివృద్ధిని సమకాలంలో రాష్ట్రంలో కూడా పొందాలన్నదే తన స్వప్నమని తెలిపారు. చెన్నైలో ఐటీ, టైడల్ పార్కులను నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఏర్పాటు చేశారని, ప్రైవేటు భాగస్వామ్యంతో మరికొన్ని ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, హోసూరు తదితర ప్రాంతాల్లో టెక్ సిటీలనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఐటీ, ఆర్థిక సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సంఘటితం చేసే కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. వీటిని ప్రస్తుత సదస్సుల్లో పాల్గొన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రపంచాన్ని గెలిచేందుకు సాంకేతికత చక్కటి సాధనమని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు సహకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో బలమైన రాష్ట్రంగా తమిళనాడును రూపొందించడానికి, సరికొత్త అవకాశాలను గుర్తించడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తోందని తెలిపారు. సాంకకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్గా రాష్ట్రం మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐటీ, డిజిటల్ సేవలశాఖ మంత్రి మనో తంగరాజ్, కార్యదర్శి కుమరగురుభరన్, యుమాజిన్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పనసపండు గుర్తు ఎక్కడ?
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం