logo

‘అందరూ సంతోషంతో జీవించాలి’

ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆంధ్రా సాంఘిక, సాంస్కృతిక సమితి (ఆస్కా) ఆధ్వర్యంలో జరిగిన శోభకృత్‌ నామ ఉగాది వేడుకల్లో అతిథులు కోరారు.

Published : 24 Mar 2023 00:25 IST

వేడుకలో పాల్గొన్న ఆస్కా ప్రతినిధులు తదితరులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆంధ్రా సాంఘిక, సాంస్కృతిక సమితి (ఆస్కా) ఆధ్వర్యంలో జరిగిన శోభకృత్‌ నామ ఉగాది వేడుకల్లో అతిథులు కోరారు. ఈ కార్యక్రమానికి  టీనగర్‌లోని ఆస్కాలో ఉన్న గోదావరి హాలు వేదికైంది. ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. తమిళనాడు అర్బన్‌ హెబిటట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఆహ్వానించినా ఇంత మంది రావడం ఆనందంగా ఉందని, తెలుగువారందరిని ఒక్కచోట చూడటం సంతోషమని చెప్పారు. ముఖ్య అతిథి గోవిందరావు ఆస్కా ఆహ్వానాన్ని మన్నించి ఆతిథ్యాన్ని స్వీకరించడం.. చక్కగా అందరితోనూ ఆయన కలివిడిగా మాట్లాడటం మరింత ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తెలుగువారందరూ ఐక్యమత్యంగా ఉండాలని, ఆస్కాలో మరిన్ని సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి అందించారు. అలాగే పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జీఎం పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని