అన్నాడీఎంకేపై పెరిగిన పట్టు!
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి ఎన్నిక కావడంతో పార్టీపై పట్టు మరింత పెరిగింది.
ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఏకగ్రీవ ఎన్నిక
ఎంజీఆర్, జయ ఆశయాల సాధనకు హామీ
పన్నీర్సెల్వం అప్పీలుపై విచారణ నేడు
ఈపీఎస్ను సత్కరిస్తున్న నేతలు
సైదాపేట, న్యూస్టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి ఎన్నిక కావడంతో పార్టీపై పట్టు మరింత పెరిగింది. ఈ ఎన్నికలకు నిషేధం విధించాలని, సర్వసభ్య సమావేశ తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీర్సెల్వం తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ గతంలో దాఖలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కుమరేష్బాబు తీర్పు ఇచ్చారు. వ్యతిరేక పిటిషన్లను కొట్టేశారు. ఓపీఎస్ తరఫున దాఖలైన మరో నాలుగింటిని కూడా రద్దు చేశారు. సర్వసభ్య సమావేశం, అందులో ఆమోదించిన తీర్మానాలు చెల్లుతాయని తీర్పులో వెల్లడించారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించిన నత్తం విశ్వనాథన్, పొల్లాచ్చి జయరామన్ల నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పలు ఇబ్బందుల తర్వాత ఎంజీఆర్, జయలలిత కల నెరవేరే విధంగా కార్యకర్తల మద్దతుతో విజయం సాధించానని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఏప్రిల్ 5 నుంచి కొత్త సభ్యత్వ దరఖాస్తులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సభ్యుడికి రూ.10 చొప్పున ప్రధాన కార్యాలయంలో చెల్లించాలని సూచించారు. ముందుగా పళనిస్వామికి మద్దతుగా హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. తర్వాత చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయానికి ఈపీఎస్ వచ్చారు. ఆయన్ను నిర్వాహకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. టపాసులు కాల్చారు. ముందుగా కార్యాలయంలోని ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు పళనిస్వామి నివాళులు అర్పించారు. నత్తం విశ్వనాథన్, పొల్లాచ్చి జయరామన్ల నుంచి గెలుపు ధ్రువపత్రం స్వీకరించి, సంతకం చేశారు. మాదవరం మూర్తి ఆయనకు మిఠాయి తినిపించారు. నిర్వాహకులు ఎంజీఆర్ టోపీ, కళ్లజోడు ధరింపచేశారు. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్, మాజీ మంత్రులు సెంగోట్టయన్, నత్తం విశ్వనాథన్, దిండిక్కల్ శ్రీనివాసన్, పొల్లాచ్చి జయరామన్, తళవాయ్ సుందరం, జయకుమార్, బెంజమిన్, వేలుమణి, తంగమణి, విజయభాస్కర్, ఉదయకుమార్, వళర్మతి, గోకుల ఇందిర తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భారీ లడ్డూను కార్యకర్తలు తెచ్చి అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఎంజీఆర్, జయలలిత స్మారక మందిరాలకు ఈపీఎస్ వెళ్లి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఓపీఎస్ తరఫున అప్పీలు పిటిషన్ దాఖలైంది. 29న విచారణ రానుంది.
మిఠాయి తినిపిస్తున్న మాజీ మంత్రి వళర్మతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
[ 20-04-2024]
స్వతంత్ర అభ్యర్థుల మధ్య చిక్కుకున్న మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వాన్ని గుర్తించలేక ఓటర్లు తికమకపడ్డారు. రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో భాజపా కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా మాజీ సీఎం బరిలో ఉన్నారు. -
కదిలొచ్చిన ఓటర్లు
[ 20-04-2024]
ఓటు వేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ముందుకొచ్చారు. ఇండియా, ఎన్డీయే, అన్నాడీఎంకే కూటముల మధ్య జరిగే ప్రధాన పోరులో అభ్యర్థుల్ని శాసించేందుకు ఓటర్లు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
డీఎంకే డబ్బుతో గెలవాలనుకుంటోంది: అన్నామలై
[ 20-04-2024]
డబ్బు ఎరచూపి కోవైని సొంతం చేసుకోవాలనుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కోవై లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అన్నామలై ఆరోపించారు. ఆయన శుక్రవారం కరూర్ జిల్లా అరవక్కురిచ్చిలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సింగపూర్ నుంచి వచ్చి..
[ 20-04-2024]
పుదుచ్చేరిలో లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం 7 గంటలకే ప్రారంభమైంది. పుదుచ్చేరి కిరుమాంబాక్కం పోలింగ్బూత్లో సింగపూర్ నుంచి వచ్చిన భారత పౌరహక్కు పొందిన యువ ఓటరు ఆర్ముగం పువియరసి(18)తన తల్లి ఆర్ముగం మాలతితో వచ్చి తొలిఓటు హక్కు వినియోగించుకున్నారు. -
40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం
[ 20-04-2024]
తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్ సిట్టాళ్ ఆచ్చి హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
అట్టడుగుకు రాజధాని
[ 20-04-2024]
చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్శాతం అట్టడుగుకు చేరింది. -
మా బాధ్యత నెరవేర్చాం.. మరి మీరు!
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి సినీ తారలు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. క్యూలో నిలబడి తమ వంతురాగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక పోరు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగిన తమిళనాడులో ఓటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఇక్కట్లు తీరలేదని ఎన్నికల బహిష్కరణ
[ 20-04-2024]
కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేప్పన్హళ్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడ అగ్రహారం పంచాయతీలోని కడవరహళ్లి గ్రామంలోని 450 మందికి పైగా ఓటర్లు, కరుక్కన్అళ్లి గ్రామంలో 1,050 మంది ఓటర్లు, తేన్గనికోట్టై సమీపంలోని కారండఅళ్లి పంచాయతీ కచ్చువాడి గ్రామంలో 961 మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు.