logo

ఎడ్ల బండిలో నూతన జంట ఊరేగింపు

ఈరోడ్‌ తిండల్‌ శక్తినగర్‌ ప్రాంతానికి చెందిన కేసీ పళనిస్వామి, ఉమామహేశ్వరి దంపతులు. వీరి కుమార్తె నిశాంతి వైద్య విద్య చదువుతున్నారు.

Published : 29 Mar 2023 00:25 IST

ఎద్దుల బండిలో నూతన దంపతులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ తిండల్‌ శక్తినగర్‌ ప్రాంతానికి చెందిన కేసీ పళనిస్వామి, ఉమామహేశ్వరి దంపతులు. వీరి కుమార్తె నిశాంతి వైద్య విద్య చదువుతున్నారు. ఈమెకు ఈరోడ్‌ వెట్టుక్కాట్టు వలసు ప్రాంతానికి చెందిన రమేష్‌, వసంతామణి దంపతుల కుమారుడు రిత్తుకి సోమవారం ఈరోడ్‌ సమీపంలోని వేప్పంపాలయంలోని ఓ కల్యాణ మండపంలో వివాహమైంది. అనంతరం వరుడు.. వధువుని ఇంటికి తీసుకెళ్లే తంతు జరిగింది. ఈ సందర్భంగా పాత సంప్రదాయాన్ని గుర్తుచేసుకునే విధంగా నూతన జంట ఎడ్ల బండిలో ఇంటికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని