logo

వైభవంగా పంగుణి ఉత్సవాలు

చెన్నై మైలాపూర్‌ కపాలీశ్వర ఆలయంలో మంగళవారం పంగుణి మాస ఉత్సవాలు ఘనంగా ప్రాంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణ చేశారు.

Published : 29 Mar 2023 00:25 IST

వెండి పల్లకిలో వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నై మైలాపూర్‌ కపాలీశ్వర ఆలయంలో మంగళవారం పంగుణి మాస ఉత్సవాలు ఘనంగా ప్రాంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ధ్వజారోహణ చేశారు. అనంతరం మహా దీపారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 3న రథోత్సవం, 6న తిరుకల్యాణం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు పలు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.

కర్పగంబాల్‌ సమేత కపాలీశ్వరస్వామి ఊరేగింపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని