ప్రయాణాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువే!
ప్రత్యేకించి మెట్రో నగరాల్లోనే కరోనా సంక్రమణ ఎక్కువగా ఉంటోందనేది పరిశోధకుల అభిప్రాయం.
బస్సుల్లో అంచనా వేసిన పరిశోధకులు
చెన్నైలోని ఓ మార్గంలో నెలపాటు పరిశీలన
ప్రత్యేకించి మెట్రో నగరాల్లోనే కరోనా సంక్రమణ ఎక్కువగా ఉంటోందనేది పరిశోధకుల అభిప్రాయం. దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, త్రివేండ్రం వంటి నగరాల్లో రవాణా సాధనాల్లో ప్రభావం కనిపించిందని చెప్పారు. ఈ తరహాలో చెన్నై పరిస్థితిపై పరిశోధకులు దృష్టిపెట్టారు. బస్సుల్లో ప్రయాణించి తాజాగా సర్వే చేశారు. ఇందులో అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఈనాడు, చెన్నై
అన్నా యూనివర్సిటీలోని ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్ వెక్టార్ కంట్రోల్ రీసెర్చి సెంటర్ సంయుక్తంగా ఈ పరిశోధన చేశాయి. ఐదుగురితో కూడిన ప్రత్యేక పరిశోధన బృందం నగరంలోని ఎంటీసీ బస్సుల్లో రద్దీ దృష్ట్యా కరోనా ఎలా ప్రబలే అవకాశం ఉందనేదానిపై రియల్టైం ఆల్గరిథమ్తో అంచనా వేశారు. ఇందుకోసం ఉత్తర, దక్షిణ చెన్నై ప్రాంతాలతో పాటు మిగిలిన మార్గాల్ని కలిపే పొడవైన మార్గాన్ని ఎంచుకున్నారు. తాంబరం-బ్రాడ్వే మధ్య 21జీ నంబరు బస్సుల్లో ప్రయాణించి వివరాల్ని సేకరించారు.
నెలపాటు ప్రయాణించి..
ఈ మార్గంలో 36.1కి.మీ. ప్రయాణంలో 40 బస్టాప్లున్నాయి. మొత్తం 106 నిమిషాల ఉంటుంది. రోజుకు 25 ట్రిప్పులు ఈ బస్సు తిరుగుతోంది. బస్సు తాంబరం నుంచి బయలుదేరేటప్పుడు సగటున 15మంది ప్రయాణికులతో బయలుదేరుతోందని, మధ్యలోని ప్రతి బస్టాప్లో కనీసం ఐదుగురు ఎక్కడమో, దిగడమో చేస్తున్నారని పరిశోధకులు గమనించారు. రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రంపూట ప్రారంభ స్టేజీలో ఒక కరోనా బాధితుడు బస్సులోకి ప్రవేశిస్తే.. అతని నుంచి ఎంతమందికి సోకే ప్రమాదం ఉందనే కోణంలో ఈ పరిశోధన చేశారు. ప్రత్యేక ఆల్గరిథమ్ ద్వారా అంచనా వేశారు. ఇలా నెలరోజులపాటూ అదే బస్సులో ప్రయాణించి సగటు వివరాలు సేకరించిన తర్వాత.. లెక్క కట్టారు. సర్వే ఫలితాల్ని ‘వైరస్ డిసీజ్’ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారు.
రోజుకు 162 మందికి..
ఈ మేరకు వచ్చిన ఫలితాల్ని బట్టి.. బస్సులో కనీసం సీట్లు 50శాతం నిండినా.. ఒక్కో ట్రిప్లో 5 నుంచి 9 మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లుగా గమనించారు. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఇది పెరగవచ్చని అంచనా వేశారు. బస్సు సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతిమంగా చేరే బ్రాడ్వే బస్ టెర్మినల్లో విస్తృతి ఎక్కువయ్యేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. రోజు మొత్తంలో 50శాతం ప్రయాణికులతో బస్సు ప్రయాణిస్తే.. సగటున 162 మందికి వైరస్ సోకే అవకాశముందని చెబుతున్నారు..
మాస్క్ తప్పనిసరి
పోస్ట్ కరోనాలో వచ్చిన కేసుల్ని గమనించిన తర్వాత ఒమిక్రాన్ రకం వైరస్తో తక్కువమంది ఆసుపత్రులపాలవడం, చనిపోవడం కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ వేసుకుని 6 నెలలు దాటిన తర్వాత దాని పనితీరులో క్షీణత ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాల్ని గ్రహించాలని తెలిపారు. తాము గమనించిన బస్సు ప్రయాణాల్లో 80శాతం మంది అసంఘటిత కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసేవారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి పనిచేసే వర్గాలపరంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. మరోవైపు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు. భౌతికదూరం కూడా పాటించాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి