న్యాయవాదుల ఆందోళన
రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణంలోని కాంచీపురం రోడ్డులో ఉన్న న్యాయస్థానం ఎదుట అరక్కోణం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకాభిరామన్ నేతృత్వంలో ఆందోళన బుధవారం జరిగింది.
సైదాపేట: బ్యాంకు ఉద్యోగులు..
అరక్కోణం, న్యూస్టుడే:రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణంలోని కాంచీపురం రోడ్డులో ఉన్న న్యాయస్థానం ఎదుట అరక్కోణం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లోకాభిరామన్ నేతృత్వంలో ఆందోళన బుధవారం జరిగింది. న్యాయవాదుల సంఘం కార్యదర్శి జానకిరామన్, కోశాధికారి వినోద్, సీనియర్ న్యాయవాదులు కన్నయ్యన్, బాల తిరువెంకటం, తమిళ్ మారన్ తదితరులు పాల్గొని తమకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బ్యాంకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా...
అరక్కోణంలో ఆందోళన చేస్తున్న న్యాయవాదులు
సైదాపేట, న్యూస్టుడే: పదోన్నతి, బదిలీలకు లంచం అడుగుతున్న కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడి తీరుకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన జరిగింది. చెన్నై బ్రాడ్వేలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట చెన్నై కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు తమిళరసు నేతృత్వంలో జరిగిన ఆందోళనలో అనేక మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సిబ్బంది...
విల్లివాక్కం: అంగన్వాడీ సిబ్బంది..
విల్లివాక్కం, న్యూస్టుడే: వేసవి దృష్ట్యా అంగన్వాడీ సిబ్బందికి నెలరోజులు సెలవులు ఇవ్వాలని కోరుతూ ధర్మపురి జిల్లా నత్తం బాలల అభివృద్ధి పథక కార్యాలయం ఎదుట అంగన్వాడీ సిబ్బంది సంఘం తరఫున బుధవారం ఆందోళన చేపట్టారు. 10 ఏళ్లుగా పని చేస్తున్న సహాయకులకు ఎలాంటి నిబంధనలు లేకుండా పదోన్నతి కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంఘ నత్తం నియోజకవర్గ కార్యదర్శి షణ్ముగవల్లి నేతృత్వం వహించారు.
పళ్ళిపట్టు, న్యూస్టుడే: తమ కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది బుధవారం పళ్ళిపట్టులో ఆందోళన చేశారు. ప్రతినిధుల సంఘం యూనియన్ కార్యదర్శి మంజుల, అధ్యక్షురాలు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో వృద్ధుడు..
వేలూర్, న్యూస్టుడే: వేలూర్ కలెక్టరేట్లో ఓ వృద్ధుడు ఆందోళన చేశాడు. అరియూర్కు చెందిన సూర్యనారాయణన్ (62) బుధవారం ఉదయం వేలూర్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. తన స్థలాన్ని ప్రభుత్వ అధికారులు ఆక్రమించి గ్రంథాలయం నిర్మిస్తున్నారని, పరిహారం ఇవ్వాలని కోరారు. తర్వాత కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా